Political News

పిక్ ఆఫ్ ద డే!.. పవన్ ఇంట చంద్రబాబు!

సెలవు దినం ఆదివారం హైదరాబాద్ లో ఓ ఆసక్తికర సస్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బాబుకు పవన్ ఎదురేగి స్వాగతం పలకగా, పవన్ ను బాబు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇద్దరూ పవన్ ఇంటిలో కూర్చుని కబుర్లలో పడ్డారు. పవన్ కు వచ్చిన వైరల్ ఫీవర్ గురించి బాబు ఆరా తీయగా… తన ప్రస్తుత పరిస్థితి, తీసుకుంటున్న చికిత్స, చికిత్సతతో మెరగువుతున్న ఆరోగ్యం తదితరాలను బాబుకు పవన్ వివరించారు.

చంద్రబాబు తన ఇంటికి వచ్చిన సమయంలో ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి.. ఆయన అందించిన పుష్పగుచ్ఛాన్ని స్వీకరించిన పవన్… బాబును తన ఇంటి లోపలికి తీసుకెళ్లే సమయంలో ముక్కును తన చేతి రుమాలుతో కప్పుకున్నారు. వైరల్ ఫీవర్ కావడంతో ఎక్కడ తన జ్వరం బాబు, ఇతరులకు సోకుతుందోనన్న ఆందోళనతోనే పవన్ ఈ జాగ్రత్త తీసుకున్నట్టు సమాచారం. ఇక తన ఇంటిలో బాబుకు పవన్ కాస్తంత దూరంలోనే కూర్చుని మాట్లాడారు. అంతేకాకుండా పవన్ పెద్దగా మాట్లాడకుండానే… బాబు అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ సాగినట్టు సమాచారం.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉన్న పవన్ అక్కడే వైరల్ ఫీివర్ బారిన పడిన విషయం తెలిసిందే. పవన్ తన తాజా చిత్రం ఓజీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఒకింత అనారోగ్యంతోనే వెళ్లిన పవన్ అక్కడ వర్షంలో తడిశారు. దీంతో పవన్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. గత వారం సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్… అనారోగ్యం కారణంగా ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. అయితే జ్వరం తగ్గితే అసెంబ్లీకి వెళదామని భావించిన పవన్… 3 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. జ్వరం తగ్గకపోవడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ ను బాబు పరామర్శించలేకపోయారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగియడం, తాను హైదరాబాద్ లో ఉండటంతో పవన్ ను బాబు పరామర్శించారు.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago