ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వైరల్ ఫీవర్తో పవన్ కల్యాణ్ బాధపడుతున్నట్టు చెప్పారు.
గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతోనే ఉన్నారని, అయితే.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని, దీంతో మరింత నీరసించారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయన వచ్చే నాలుగు రోజుల పాటు రెస్టు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. ప్రస్తుతం మంగళగిరి కార్యాలయంలోనే పవన్ రెస్టు తీసుకుంటున్నారు.
వరుసగా బిజీ…
గత మూడు రోజులుగా పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడిపారు. వాస్తవానికి ఆయన అనారోగ్యంతో ఉన్న విషయం మంగళవారం వరకు ఎవరికీ తెలియదు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ప్రకటించింది.
అదేసమయంలో ఆయన సోమవారం సాయంత్రం విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. తొలిరోజు శరన్నవరాత్రుల లో అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే.. అనూహ్యంగా సాయంత్రం నుంచి తీవ్రంగా నీరసించి పోవడంతో వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించి వైరల్ జ్వరంతో బాథపడుతున్నట్టు తెలిపారు.
This post was last modified on September 24, 2025 6:57 am
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…