ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వైరల్ ఫీవర్తో పవన్ కల్యాణ్ బాధపడుతున్నట్టు చెప్పారు.
గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతోనే ఉన్నారని, అయితే.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని, దీంతో మరింత నీరసించారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయన వచ్చే నాలుగు రోజుల పాటు రెస్టు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. ప్రస్తుతం మంగళగిరి కార్యాలయంలోనే పవన్ రెస్టు తీసుకుంటున్నారు.
వరుసగా బిజీ…
గత మూడు రోజులుగా పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడిపారు. వాస్తవానికి ఆయన అనారోగ్యంతో ఉన్న విషయం మంగళవారం వరకు ఎవరికీ తెలియదు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ప్రకటించింది.
అదేసమయంలో ఆయన సోమవారం సాయంత్రం విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. తొలిరోజు శరన్నవరాత్రుల లో అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే.. అనూహ్యంగా సాయంత్రం నుంచి తీవ్రంగా నీరసించి పోవడంతో వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించి వైరల్ జ్వరంతో బాథపడుతున్నట్టు తెలిపారు.
This post was last modified on September 24, 2025 6:57 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…