Political News

శ్రీవారి పరకామణి: మరో రాజకీయ వివాదం!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తులు తమ శక్తి కొలది స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. దీనిలో కీలకమైంది ఆర్థిక మొక్కు. ఎంత కటికపేద వాడైనా శ్రీవారిని దర్శించుకున్నాక పరకామణి (శ్రీవారికి నగదు కానుకలు ఇచ్చే చోటు)ని చూడకుండా, దానిలో కనీసం రూపాయి అయినా వేయకుండా కొండ దిగడు. ఇక శ్రీమంతుల సంగతే చెప్పనక్కర్లేదు. కోట్లకు కోట్ల కానుకలు శ్రీవారికి సమర్పించుకుంటారు. అయితే తాజాగా ఈ పరకామణి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

ఏం జరిగింది?

2023లో తిరుమల శ్రీవారి పరకామణి సొమ్మును లెక్కించే సమయంలో పరకామణి విభాగానికి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న ఓ అధికారి సొమ్మును కాజేశారు. ఇది సీసీ టీవీ ఫుటేజీలోనూ బయటపడింది. అప్పట్లోనే ఇది పెద్ద వివాదంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న అప్పటి టీటీడీ చైర్మన్, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేసు పెట్టారు. సదరు అధికారిని సస్పెండ్ కూడా చేశారు. ఆయన నుంచి విజిలెన్స్ అధికారులు కొంత సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును అప్పట్లో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు.

దీనిపై తాజాగా బీజేపీ నాయకుడు, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు. నాడు జరిగిన దొంగతనం కేసుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ కేసును తిరిగి తెరవాలని సీఎం చంద్రబాబుకు వినతిపెట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ నాయకులపైనా, వైసీపీ అధినేత జగన్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వామివారి సొత్తు రూ.100 కోట్లను దోచేశారని అన్నారు. దీనిలో కోట్ల సొమ్ము పరకామణి నుంచే దారిమళ్లిందని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేయించాలనే కోరనున్నట్టు తెలిపారు.

అంతేకాదు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని, దర్శన టికెట్లు దొడ్డిదారిలో అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారని, అన్నప్రసాదాలను నాశిరకం చేసి భక్తుల కడుపు మాడ్చారని, శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను దారి మళ్లించారని, దీనిలో అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా జగన్‌కూ వాటాలు అందాయని నారా లోకేష్ ఆరోపించారు. ఈ మొత్తం విలువ రూ.100 కోట్లపైమాటేనని చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబు పదే పదే శ్రీవారి జోలికి వెళ్లొద్దని చెప్పినా వైసీపీ నాయకులు వినిపించుకోలేదని, దీంతో గత ఎన్నికల్లో మట్టి కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on September 20, 2025 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

58 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

7 hours ago