అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తులు తమ శక్తి కొలది స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. దీనిలో కీలకమైంది ఆర్థిక మొక్కు. ఎంత కటికపేద వాడైనా శ్రీవారిని దర్శించుకున్నాక పరకామణి (శ్రీవారికి నగదు కానుకలు ఇచ్చే చోటు)ని చూడకుండా, దానిలో కనీసం రూపాయి అయినా వేయకుండా కొండ దిగడు. ఇక శ్రీమంతుల సంగతే చెప్పనక్కర్లేదు. కోట్లకు కోట్ల కానుకలు శ్రీవారికి సమర్పించుకుంటారు. అయితే తాజాగా ఈ పరకామణి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ఏం జరిగింది?
2023లో తిరుమల శ్రీవారి పరకామణి సొమ్మును లెక్కించే సమయంలో పరకామణి విభాగానికి ఇంచార్జ్గా వ్యవహరిస్తున్న ఓ అధికారి సొమ్మును కాజేశారు. ఇది సీసీ టీవీ ఫుటేజీలోనూ బయటపడింది. అప్పట్లోనే ఇది పెద్ద వివాదంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న అప్పటి టీటీడీ చైర్మన్, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేసు పెట్టారు. సదరు అధికారిని సస్పెండ్ కూడా చేశారు. ఆయన నుంచి విజిలెన్స్ అధికారులు కొంత సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును అప్పట్లో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు.
దీనిపై తాజాగా బీజేపీ నాయకుడు, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు. నాడు జరిగిన దొంగతనం కేసుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ కేసును తిరిగి తెరవాలని సీఎం చంద్రబాబుకు వినతిపెట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ నాయకులపైనా, వైసీపీ అధినేత జగన్పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వామివారి సొత్తు రూ.100 కోట్లను దోచేశారని అన్నారు. దీనిలో కోట్ల సొమ్ము పరకామణి నుంచే దారిమళ్లిందని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేయించాలనే కోరనున్నట్టు తెలిపారు.
అంతేకాదు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని, దర్శన టికెట్లు దొడ్డిదారిలో అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారని, అన్నప్రసాదాలను నాశిరకం చేసి భక్తుల కడుపు మాడ్చారని, శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను దారి మళ్లించారని, దీనిలో అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా జగన్కూ వాటాలు అందాయని నారా లోకేష్ ఆరోపించారు. ఈ మొత్తం విలువ రూ.100 కోట్లపైమాటేనని చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబు పదే పదే శ్రీవారి జోలికి వెళ్లొద్దని చెప్పినా వైసీపీ నాయకులు వినిపించుకోలేదని, దీంతో గత ఎన్నికల్లో మట్టి కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on September 20, 2025 10:11 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…