టిడిపి బలంగా ఉన్నచోట, గత ఎన్నికల్లో జూనియర్లకు అవకాశం కల్పించారు. కొత్త తరం నాయకులకు అవకాశం ఇచ్చారని చెబుతున్న సీఎం చంద్రబాబు, యువ రక్తానికి అవకాశం ఇచ్చారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో కొత్త తరం నాయకులు, వారసులు తెరమీదకు వచ్చి పోటీ చేసి విజయం సాధించారు.
అయితే, ఈ స్థానాల్లో ఉన్న సీనియర్లకు, జూనియర్ల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఆధిపత్య ధోరణితోపాటు అధికారం విషయంలో కూడా ఇరుపాక్షాల మధ్య చికాకులు, గొడవలు తెర మీదకు వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అసలు విషయం ఏమిటి? ఎందుకు గొడవ పడుతున్నారు? పార్టీ తరఫున ఇటీవల సమాచారం రాబట్టారు. సాధారణంగా ఆదాయాలకు, పనులకు సంబంధించి వివాదాలు జరుగుతుంటాయి. అయితే, దీనికి మించి వచ్చే ఎన్నికల్లో జూనియర్లకే అవకాశం ఇస్తే, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది సీనియర్ నాయకుల ఆవేదన ప్రధాన విషయం.
వీరు దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పనిచేసి ప్రజలను కలుసుకుని పార్టీని డెవలప్ చేశారు. చాలా మంది తమ ఖర్చుతో కూడా పార్టీ అభివృద్ధికి సహకరించారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లేకపోతే ఏం జరుగుతుందో, భవిష్యత్తులో టికెట్ రాదా, తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్లపై సీనియర్ల విమర్శలు, అంతర్గత చర్చలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాయి. ఇటీవల నియోజకవర్గాల్లో కుల సమీకరణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే మరియు సీనియర్ నాయకుడి కులం ఒకటే అయినప్పటికీ, ఆ కుల సంఘాల్లో విభజనలను సృష్టించి తమకు అనుకూలంగా మార్చుకునే నాయకులు పెరుగుతున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల ప్రభావం తగ్గకుండా చూసుకోవడం, ప్రస్తుత ఎమ్మెల్యేకి చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.
ఈ వివాదాలు పెరుగుతున్నాయి. ఈ విషయం పార్టీ అగ్రనాయకులకు చేరింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన కనిపించడం లేదు. సీనియర్లకు పదవులు ఇస్తామని హామీలు ఇచ్చి, గత ఎన్నికల్లో టికెట్లను కొత్తవారికి అప్పగించారు. ఇప్పటివరకు సీనియర్లకు న్యాయం చేయలేదు. అందువల్ల, వారు ఇప్పుడు న్యాయం కోరుతున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ల సమస్యలను సీఎం చంద్రబాబు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది.
మరి, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on September 20, 2025 2:22 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…