అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం నాటి సీఎం జగన్ సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ ను ప్రవేశపెడతామని ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను విపక్షాల కంటే ముందుగా జగన్ పార్టీ ఎంపీగా ఉండి మరీ ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఖండించారు. జగన్ నిర్ణయంతో రాజు గారు పూర్తిగా వైసీపీకి దూరయ్యారు. అయినా తెలుగుపై రాజు గారికి ఇంత ప్రేమ ఎందుకు? పదవులను పోగొట్టుకునే ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా? అని అంతా నొసలు చిట్లించారు. అయితే రాజు గారు నాడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పుడు విస్పష్టంగా తెలిసి వస్తోంది. ఉపసభాపతి స్థానంలో ఉన్న రాజు గారు శుక్రవారం నాటి సభలో మన అమ్మ భాష తెలుగు కమ్మదనం ఎలా ఉంటుందో చూపించారు.
శుక్రవారం నాటి ఏపీ అసెంబ్లీ ముందుకు మధ్యాహ్నం సమయంలో పలు కీలక బిల్లుకు వచ్చాయి. ఈ సమయంలో అధ్యక్ష స్థానంలో రాజు గారే ఉన్నారు. బిల్లును ప్రస్తావించడంతో పాటుగా ఆ బిల్లుకు అనుకూలంగా ఉన్నవారు అవును అని చెప్పండి… వ్యతిరేకంగా ఉన్న వారు కాదు అని చెప్పండి అని రాజు గారు తెలిపారు. సభలో ఉన్నదంతా కూటమి పార్టీల ఎమ్మెల్యేలే కాబట్టి అంతా అవుననే అన్నారు. ఈ సందర్భంగా అవును అన్నారు… అందరూ అవును అన్నారు బిల్లుకు సభ ఆమోదం లభించింది అంటూ అచ్చ తెలుగు భాషలో పలికారు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ తరహా మాటలు విని ఉండం. అయితే రాజు గారి పుణ్యమా అని ఆ మాటలను ఇప్పుడు తెలుగులో వినే అవకాశం లభించింది.
సాధారణంగా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తమ మాతృ భాషను అధికంగా వినియోగించాలన్న కదులుతున్నా… బిల్లుల ఆమోదంలో మాత్రం నాటి బ్రిటిషర్లు నేర్పిన… దోస్ హూ ఆర్ ప్రపోజ్ సే ఎస్..దోస్ హూ ఆర్ అపోజ్ సే నో అంటూ స్పీకర్ కోరడం…ఆ తర్వాత సభ్యుల ఎస్ లు, నో లను విని ఆ బిల్లు ఆమోదం పొందిందో, లేదో తెలిపే విషయాన్ని కూడా ఆంగ్లంలోనే చెప్పేసి ముగిస్తారు. అయితే అందుకు భిన్నంగా రాజు గారు తనదైన శైలిలో అమ్మభాష పరిమళాన్ని అసెంబ్లీ ద్వారా తెలుగు ప్జజలకు వినిపించారు. బిల్లుల విషయమే కాకుండా రాజు గారు తన నోట నుంచి వచ్చే ప్రతి మాటను కూడా తెలుగులోనే వచ్చేలా చూసుకుంటున్నారు. వెరసి రాజు గారు అధ్యక్ష స్థానంలో ఉంటే.. సభ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
This post was last modified on September 19, 2025 5:00 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…