Political News

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ.. ఆ పదవి కోసమేనా?

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కొన్నాళ్ల కిందటే పార్టీకి రాజీనామా చేశారు. అదేసమయంలో ఆయన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అయితే అప్పటి నుంచి ఏ పార్టీలో చేరాలా అన్న ఆలోచన చేసిన ఆయన తాజాగా సైకిల్‌ను ఎంచుకున్నట్టుగా తెలిసింది. శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని మర్రి అనుచరులు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ వైఎస్ హయాం నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత ముఖ్య నాయకుడిగా మారారు.

ఈ క్రమంలోనే 2019లో సీటును త్యాగం చేశారు. అప్పట్లో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కూడా ఇస్తానని బహిరంగ సభ సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా ఆయనను పట్టించుకోలేదు. ఎట్టకేల‌కు ప్రభుత్వం పడిపోతున్న దశలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటున్న మర్రి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా సమర్పించారు. కానీ పదవిని మాత్రం వదులుకోలేదు. ఈ వ్యవహారం వెనుక గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎంపీ ఉన్నారని సమాచారం.

వైసీపీని వదిలేసినా ఎమ్మెల్సీగా ఉన్న మర్రి ఏనాడూ సభకు రాలేదు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబును కలిసిన ఆయన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఆయన పార్టీ మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2004లో విజయం దక్కించుకున్న మర్రి రాజశేఖర్ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా రాజకీయంగా ఆయన మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు కలసి వస్తున్న పరిణామాలుగా చెబుతున్నారు.

అయితే ఆది నుంచి రాజకీయ వైరం ఉండడంతో చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మర్రి రాకను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు చర్చించి వచ్చే ఎన్నికల్లో టికెట్ వ్యవహారం అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, ఇప్పుడే దానిపై చర్చ అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతం కావడం ముఖ్యమని స్పష్టం చేశారు. దీంతో పుల్లారావు వెనక్కి తగ్గారు.

ఫలితంగా మర్రి రాజశేఖర్‌కు మార్గం సుగమం అయిందని తెలిసింది.

This post was last modified on September 19, 2025 4:11 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

37 minutes ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

56 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

57 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

5 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

5 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

5 hours ago