కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కె రాంప్ కు సంబంధించి ఇప్పటిదాకా రెండు టీజర్లు వచ్చాయి. యూత్ ఫుల్ గా ఉన్నాయి. తను ఇప్పటిదాకా ట్రై చేయని కొత్త కామెడీ టింజ్ ట్రై చేసిన కిరణ్ వెరైటీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక యుట్యూబ్ రివ్యూయర్ ని ఇమిటేట్ చేయడం దగ్గరి నుంచి అమ్మాయిల మీద వేసే జోకులు దాకా రకరకాల షేడ్స్ చూపించాడు. ఇదంతా బాగానే ఉంది కానీ కావాల్సినన్ని బూతులు జొప్పించడం యువతకేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఎబెట్టుగా అనిపించేలా ఉంది. బూతుని నేరుగా వాడకుండా అది ఏ బూతో స్పష్టంగా అర్థమయ్యేలా డైలాగులు రాసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి డబుల్ మీనింగ్స్ ఉంటే యూత్ ఎక్కువగా అట్రాక్జ్ అవుతారనే అంచనా ఏమైనా కిరణ్ లో ఉందేమో చూడాలి. ఒకవేళ అదే అయితే ఇది నిజం కాదని గుర్తించాలి. ఎందుకంటే ఇటీవలే విడుదలైన సెన్సేషన్ లిటిల్ హార్ట్స్ లో ఒకటి రెండు తప్ప ఎక్కడ అసభ్యత, ద్వందార్థాలు లేవు. క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో దర్శకుడు సాయి మార్తాండ్, హీరో మౌళి మెప్పించారు. కానీ కె రాంప్ దానికి పూర్తి విభిన్నంగా అనిపిస్తోంది. కథ పరంగా సింపుల్ గానే అనిపిస్తోంది. కేరళకు చదువు కోసం వెళ్లిన ఓ అల్లరి కుర్రాడు అక్కడి అమ్మాయిని ప్రేమించి ఏం చేశాడనే పాయింట్ మీద రూపొందించారు.
ఫ్లాపులను పక్కనపెడితే ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, క ఇలా ఒక ఫ్లోలో క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో వెళ్తున్న కిరణ్ అబ్బవరం కేవలం ట్రెండ్ ని ఫాలో అవుతూ టార్గెట్ ఆడియన్స్ కోసం రూటు మార్చాడా లేక తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించుకోవడానికి ఇలా చేశాడా అనేది వేచి చూడాలి. వచ్చే నెల 18 విడుదల కాబోతున్న కె రాంప్ కు పోటీగా సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా వస్తోంది. అదేమో సాఫ్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కె రాంప్ ఏమో ఊర మాస్ సరదా ప్రేమకథ. కిరణ్ అబ్బవరంకు దిల్ రుబా చేసిన గాయం మానాలంటే కె రాంప్ ఓ రేంజ్ లో హిట్టవ్వాల్సిందే.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…