కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ద్వారా తమ ఆస్తులకు భంగం కలుగుతుందంటూ దేశవ్యాప్తంగా 100కి పైగా పిటిషన్లు పడ్డాయి. వీటిలో ప్రధానంగా ముస్లింల ఆచారాలు, వ్యవహారాలు, ఆస్తుల్లోకి కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు చట్టాన్నే పూర్తిగా రద్దు చేయాలని, పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. అయితే ఈ పిటిషన్లపై ఇప్పటికే పలు దఫాలుగా కోర్టు విచారించింది.
తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో పూర్తిగా వక్ఫ్ సవరణ బిల్లు-2025లో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల చట్టం స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని పేర్కొంది. అయితే కీలకమైన ఒక నిబంధనపై మాత్రం స్టే విధించగలమని తెలిపింది. ఐదేళ్లపాటు ముస్లింను అనుసరించిన వ్యక్తి ఆస్తులను మాత్రమే వక్ఫ్ చేయగల నిబంధనపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి కొన్ని రక్షణలు ఉండాలని పేర్కొంది.
మరిన్ని అంశాలు
అనేక వివాదాలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై అనేక వివాదాలు రాజుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన కూడా చేశారు. తమను ఆర్థికంగా అణగదొక్కడానికే, స్వతంత్రాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం మాత్రం వక్ఫ్ ఆస్తులు పబ్లిక్, ప్రైవేటు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికే దీనిని తీసుకువచ్చామని పేర్కొంది.
This post was last modified on September 15, 2025 2:03 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…