కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ద్వారా తమ ఆస్తులకు భంగం కలుగుతుందంటూ దేశవ్యాప్తంగా 100కి పైగా పిటిషన్లు పడ్డాయి. వీటిలో ప్రధానంగా ముస్లింల ఆచారాలు, వ్యవహారాలు, ఆస్తుల్లోకి కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు చట్టాన్నే పూర్తిగా రద్దు చేయాలని, పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. అయితే ఈ పిటిషన్లపై ఇప్పటికే పలు దఫాలుగా కోర్టు విచారించింది.
తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో పూర్తిగా వక్ఫ్ సవరణ బిల్లు-2025లో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల చట్టం స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని పేర్కొంది. అయితే కీలకమైన ఒక నిబంధనపై మాత్రం స్టే విధించగలమని తెలిపింది. ఐదేళ్లపాటు ముస్లింను అనుసరించిన వ్యక్తి ఆస్తులను మాత్రమే వక్ఫ్ చేయగల నిబంధనపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి కొన్ని రక్షణలు ఉండాలని పేర్కొంది.
మరిన్ని అంశాలు
అనేక వివాదాలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై అనేక వివాదాలు రాజుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన కూడా చేశారు. తమను ఆర్థికంగా అణగదొక్కడానికే, స్వతంత్రాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం మాత్రం వక్ఫ్ ఆస్తులు పబ్లిక్, ప్రైవేటు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికే దీనిని తీసుకువచ్చామని పేర్కొంది.
This post was last modified on September 15, 2025 2:03 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…