Political News

రేవంత్‌కు మరక: ఫస్ట్ టైమ్ ఏం జరిగిందంటే!

తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. యూరియా దొరకక ఇప్పటివరకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యా యత్నాలు చేశారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, యూరియా సమృద్ధిగానే ఉందని, కేంద్రం సరఫరా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

ఏ జిల్లాలో చూసినా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద క్యూలో నిలబడి వేచి ఉంటున్నారు. అన్నం, నీరు కూడా మరిచి యూరియా కోసం నిలబడుతున్న పరిస్థితి. ఎక్కడ విక్రయ కేంద్రం ఉన్నా అక్కడ రైతులు గుంపులుగా క్యూకడుతున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటుచేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు రప్పించాయి.

ఏం జరిగింది?

బీబీ మండలంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రానికి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సమయంలో తోపులాట జరిగి, ఒక రైతు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనకు ఫిట్స్ వచ్చినట్టు గుర్తించిన ఇతర రైతులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ప్రాణాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందని దుయ్యబట్టాయి.

ఇక రైతులు కూడా తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బీబీ మండలానికి పోటెత్తిన రైతులను కట్టడి చేయలేకపోయిన అధికారులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విక్రయ కేంద్రానికి తాళాలు వేసి మూసేశారు.

స్టేషన్‌లో రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే వేలాది మంది రైతులు ఉన్నా కేవలం 938 యూరియా బస్తాలకే టోకెన్లు ఇచ్చారు. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో రైతులు తిరగబడ్డారు.

ఈ వ్యవహారం మరింతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శలు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా యూరియా కోసం అన్నదాతను పోలీస్ స్టేషన్ గడప తొక్కించారని, లాఠీచార్జ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. రైతులు కూడా దీనిని తీవ్రంగా భావిస్తున్నారు.

“మా కష్టాలు తాత్కాలికం. రేపు మాకు కూడా అవకాశం వస్తుంది” అని రైతులు వ్యాఖ్యానించారు.

This post was last modified on September 14, 2025 1:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago