Political News

రేవంత్‌కు మరక: ఫస్ట్ టైమ్ ఏం జరిగిందంటే!

తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. యూరియా దొరకక ఇప్పటివరకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యా యత్నాలు చేశారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, యూరియా సమృద్ధిగానే ఉందని, కేంద్రం సరఫరా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

ఏ జిల్లాలో చూసినా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద క్యూలో నిలబడి వేచి ఉంటున్నారు. అన్నం, నీరు కూడా మరిచి యూరియా కోసం నిలబడుతున్న పరిస్థితి. ఎక్కడ విక్రయ కేంద్రం ఉన్నా అక్కడ రైతులు గుంపులుగా క్యూకడుతున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటుచేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు రప్పించాయి.

ఏం జరిగింది?

బీబీ మండలంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రానికి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సమయంలో తోపులాట జరిగి, ఒక రైతు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనకు ఫిట్స్ వచ్చినట్టు గుర్తించిన ఇతర రైతులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ప్రాణాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందని దుయ్యబట్టాయి.

ఇక రైతులు కూడా తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బీబీ మండలానికి పోటెత్తిన రైతులను కట్టడి చేయలేకపోయిన అధికారులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విక్రయ కేంద్రానికి తాళాలు వేసి మూసేశారు.

స్టేషన్‌లో రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే వేలాది మంది రైతులు ఉన్నా కేవలం 938 యూరియా బస్తాలకే టోకెన్లు ఇచ్చారు. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో రైతులు తిరగబడ్డారు.

ఈ వ్యవహారం మరింతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శలు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా యూరియా కోసం అన్నదాతను పోలీస్ స్టేషన్ గడప తొక్కించారని, లాఠీచార్జ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. రైతులు కూడా దీనిని తీవ్రంగా భావిస్తున్నారు.

“మా కష్టాలు తాత్కాలికం. రేపు మాకు కూడా అవకాశం వస్తుంది” అని రైతులు వ్యాఖ్యానించారు.

This post was last modified on September 14, 2025 1:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 minutes ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

2 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago