Political News

రేవంత్‌కు మరక: ఫస్ట్ టైమ్ ఏం జరిగిందంటే!

తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. యూరియా దొరకక ఇప్పటివరకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యా యత్నాలు చేశారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, యూరియా సమృద్ధిగానే ఉందని, కేంద్రం సరఫరా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

ఏ జిల్లాలో చూసినా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద క్యూలో నిలబడి వేచి ఉంటున్నారు. అన్నం, నీరు కూడా మరిచి యూరియా కోసం నిలబడుతున్న పరిస్థితి. ఎక్కడ విక్రయ కేంద్రం ఉన్నా అక్కడ రైతులు గుంపులుగా క్యూకడుతున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటుచేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు రప్పించాయి.

ఏం జరిగింది?

బీబీ మండలంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రానికి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సమయంలో తోపులాట జరిగి, ఒక రైతు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనకు ఫిట్స్ వచ్చినట్టు గుర్తించిన ఇతర రైతులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ప్రాణాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందని దుయ్యబట్టాయి.

ఇక రైతులు కూడా తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బీబీ మండలానికి పోటెత్తిన రైతులను కట్టడి చేయలేకపోయిన అధికారులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విక్రయ కేంద్రానికి తాళాలు వేసి మూసేశారు.

స్టేషన్‌లో రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే వేలాది మంది రైతులు ఉన్నా కేవలం 938 యూరియా బస్తాలకే టోకెన్లు ఇచ్చారు. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో రైతులు తిరగబడ్డారు.

ఈ వ్యవహారం మరింతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శలు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా యూరియా కోసం అన్నదాతను పోలీస్ స్టేషన్ గడప తొక్కించారని, లాఠీచార్జ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. రైతులు కూడా దీనిని తీవ్రంగా భావిస్తున్నారు.

“మా కష్టాలు తాత్కాలికం. రేపు మాకు కూడా అవకాశం వస్తుంది” అని రైతులు వ్యాఖ్యానించారు.

This post was last modified on September 14, 2025 1:46 am

Share

Recent Posts

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

33 minutes ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

6 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

7 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

8 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

8 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

9 hours ago