Political News

రేవంత్‌కు మరక: ఫస్ట్ టైమ్ ఏం జరిగిందంటే!

తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. యూరియా దొరకక ఇప్పటివరకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యా యత్నాలు చేశారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, యూరియా సమృద్ధిగానే ఉందని, కేంద్రం సరఫరా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

ఏ జిల్లాలో చూసినా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద క్యూలో నిలబడి వేచి ఉంటున్నారు. అన్నం, నీరు కూడా మరిచి యూరియా కోసం నిలబడుతున్న పరిస్థితి. ఎక్కడ విక్రయ కేంద్రం ఉన్నా అక్కడ రైతులు గుంపులుగా క్యూకడుతున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటుచేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు రప్పించాయి.

ఏం జరిగింది?

బీబీ మండలంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రానికి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సమయంలో తోపులాట జరిగి, ఒక రైతు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనకు ఫిట్స్ వచ్చినట్టు గుర్తించిన ఇతర రైతులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ప్రాణాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందని దుయ్యబట్టాయి.

ఇక రైతులు కూడా తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బీబీ మండలానికి పోటెత్తిన రైతులను కట్టడి చేయలేకపోయిన అధికారులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విక్రయ కేంద్రానికి తాళాలు వేసి మూసేశారు.

స్టేషన్‌లో రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే వేలాది మంది రైతులు ఉన్నా కేవలం 938 యూరియా బస్తాలకే టోకెన్లు ఇచ్చారు. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో రైతులు తిరగబడ్డారు.

ఈ వ్యవహారం మరింతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శలు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా యూరియా కోసం అన్నదాతను పోలీస్ స్టేషన్ గడప తొక్కించారని, లాఠీచార్జ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. రైతులు కూడా దీనిని తీవ్రంగా భావిస్తున్నారు.

“మా కష్టాలు తాత్కాలికం. రేపు మాకు కూడా అవకాశం వస్తుంది” అని రైతులు వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

32 minutes ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

3 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

8 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

10 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

10 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

12 hours ago