Political News

ఇక నుంచి `జెట్ స్పీడ్`: తేల్చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న వేగం పెంచుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. “ఇప్ప‌టికి 15 మాసాలు గ‌డిచాయి. మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశాం. అనేక అభివృద్ధి ప‌నులు చేశాం. కేంద్రంతో సంబంధాలు మ‌రింత బ‌లోపేతం చేశాం. పెట్టుబ‌డులు తెస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు. కానీ, ఇక‌, నుంచి స్పీడ్ పెంచుతున్నాం. ఇక‌పై `జెట్ స్పీడ్‌`తో నేను ముందుకు పోతా.. నాతో క‌లిసి ప్ర‌యాణించండి. లేక‌పోతే..వెనుక‌బ‌డిపోతారు. అదే జ‌రిగితే.. భ‌విష్య‌త్తులో మీరుఎక్క‌డ ఉంటారో ఊహించుకోండి.“ అని మంత్రులు, ఉన్న‌తాధికారులను ఉద్దేశించి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

తాజాగా రాష్ట్రంలో రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 1) 12 మంది క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేశారు. వీరిలో న‌లుగురు కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా తాజాగా శ‌నివారం 14 జిల్లాల ఎస్పీల‌ను బ‌దిలీ చేశారు. వీరిలో ఏడుగురు కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. ఇదేస‌మ‌యంలో తీవ్ర వివాదాలు ఎదుర్కొన్న‌.. రాజ‌కీయ వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌లేక పోయిన‌.. మ‌రో ఆరుగురు ఎస్పీల‌ను ప‌క్క‌న పెట్టారు. వీరిలో నంద్యాల, శ్రీస‌త్య‌సాయి, క‌డ‌ప‌, నెల్లూరు, ప‌ల్నాడు, కృష్ణా జిల్లాల ఎస్పీలు ఉన్నారు. వీరికి ఎక్క‌డా పోస్టింగు ఇవ్వ‌కుండా డీజీపీ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయ్యారు. ఈ స‌మావేశానికి అందుబాటులో ఉన్న మంత్రుల‌ను కూడా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్తు పాల‌న‌పై చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. “ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి జెట్ స్పీడే. మీ అంత‌ట మీరే పుంజుకోవాలి. ఇక్క‌డ స్పూన్ ఫీడింగ్ ఉండ‌దు.“ అని చెప్పారు. అంతేకాదు.. పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని.. వ‌చ్చే రెండు మూడు మాసాల్లో ప‌నులు కూడా పుంజుకుంటాయ‌ని తెలిపారు. అప్ప‌టికి కూడా వేగం పుంజుకోక పోతే.. ప్ర‌జ‌లు అన్నీగ‌మ‌నిస్తున్నార‌ని.. వ్యాఖ్యానించారు. నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని మంత్రుల‌ను ఆదేశించారు.

సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అందించాల‌ని, అభివృద్ధిని కూడా చేయాల‌ని  క‌లెక్ట‌ర్ల‌ను, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను మ‌రో లెవిల్‌కు తీసుకువెళ్లాల‌ని ఎస్పీల‌ను ఆయ‌న ఆదేశించారు. ఈ విష‌యంలో వెనుక‌బ‌డితే.. ఉపేక్షించేది లేద‌న్నారు. ఒక‌వేళ కాదు.. కూడ‌దంటే.. మీరు అక్క‌డే ఉండిపోతార‌ని వ్యాఖ్యానించారు. అనేక స‌మ‌స్య‌లు ఉన్నా.. సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని.. అనేక పెట్టుబ‌డులు కూడా తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రింత వేగంతో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 13, 2025 11:00 pm

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

36 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago