ఏపీలో గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై పెద్ద రచ్చే నడుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి సాధించామని వైసీపీ చెబుతుంటే, వాటిని తామేమీ ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మడం లేదని, పీపీపీ పద్ధతిలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని కూటమి పార్టీలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో గడచిన మూడు రోజులుగా అటు కూటమి పార్టీల నేతలు, ఇటు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల నిర్మాణాలను పరిశీలిస్తూ సాగుతున్నారు. అయితే ఒకటి, అరా తప్పించి అన్ని చోట్ల ఆయా కాలేజీల నిర్మాణం మొండిగోడల వద్దే నిలిచిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
వైసీపీ జమానాలో కేంద్రం ఏపీకి మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో జగన్ తన సొంతూరు పులివెందులలో కాలేజీ నిర్మాణం పూర్తి చేశారు. అదే మాదిరిగా మచిలీపట్నం, నంద్యాల, ఇటీవలే పాడేరు మెడికల్ కాలేజీలు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన కాలేజీలన్నీ దాదాపు పునాదులు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి.
ఈ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్న కూటమి పార్టీల నేతలు జగన్ కట్టించిన కాలేజీల స్థితి ఇది అంటూ సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన జనం కూడా వైసీపీ నేతల వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, శుక్రవారం వైసీపీ కీలక నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ తమ అనుచరులతో కలిసి నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఇక్కడ కూడా కొన్ని ఫ్లోర్ల మేర శ్లాబ్ అయితే వేశారు గానీ, ఇంకా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి.
ఇదే వీడియోను వైసీపీ యాక్టివిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. ఈ వీడియోను చూసిన వారు ఇది కూడ మొండిగోడలతోనే ఉంది కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వెరసి, కట్టని కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యిందని చెబితే ఇలాగే అభాసుపాలు అవుతారని చెప్పక తప్పదు.
This post was last modified on September 12, 2025 10:52 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…