ఏపీలో గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై పెద్ద రచ్చే నడుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి సాధించామని వైసీపీ చెబుతుంటే, వాటిని తామేమీ ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మడం లేదని, పీపీపీ పద్ధతిలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని కూటమి పార్టీలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో గడచిన మూడు రోజులుగా అటు కూటమి పార్టీల నేతలు, ఇటు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల నిర్మాణాలను పరిశీలిస్తూ సాగుతున్నారు. అయితే ఒకటి, అరా తప్పించి అన్ని చోట్ల ఆయా కాలేజీల నిర్మాణం మొండిగోడల వద్దే నిలిచిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
వైసీపీ జమానాలో కేంద్రం ఏపీకి మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో జగన్ తన సొంతూరు పులివెందులలో కాలేజీ నిర్మాణం పూర్తి చేశారు. అదే మాదిరిగా మచిలీపట్నం, నంద్యాల, ఇటీవలే పాడేరు మెడికల్ కాలేజీలు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన కాలేజీలన్నీ దాదాపు పునాదులు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి.
ఈ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్న కూటమి పార్టీల నేతలు జగన్ కట్టించిన కాలేజీల స్థితి ఇది అంటూ సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన జనం కూడా వైసీపీ నేతల వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, శుక్రవారం వైసీపీ కీలక నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ తమ అనుచరులతో కలిసి నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఇక్కడ కూడా కొన్ని ఫ్లోర్ల మేర శ్లాబ్ అయితే వేశారు గానీ, ఇంకా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి.
ఇదే వీడియోను వైసీపీ యాక్టివిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. ఈ వీడియోను చూసిన వారు ఇది కూడ మొండిగోడలతోనే ఉంది కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వెరసి, కట్టని కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యిందని చెబితే ఇలాగే అభాసుపాలు అవుతారని చెప్పక తప్పదు.
This post was last modified on September 12, 2025 10:52 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…