Political News

ఎవరెళ్లినా కనిపించేది మొండిగోడలేగా!

ఏపీలో గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై పెద్ద రచ్చే నడుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి సాధించామని వైసీపీ చెబుతుంటే, వాటిని తామేమీ ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మడం లేదని, పీపీపీ పద్ధతిలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని కూటమి పార్టీలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో గడచిన మూడు రోజులుగా అటు కూటమి పార్టీల నేతలు, ఇటు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల నిర్మాణాలను పరిశీలిస్తూ సాగుతున్నారు. అయితే ఒకటి, అరా తప్పించి అన్ని చోట్ల ఆయా కాలేజీల నిర్మాణం మొండిగోడల వద్దే నిలిచిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

వైసీపీ జమానాలో కేంద్రం ఏపీకి మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో జగన్ తన సొంతూరు పులివెందులలో కాలేజీ నిర్మాణం పూర్తి చేశారు. అదే మాదిరిగా మచిలీపట్నం, నంద్యాల, ఇటీవలే పాడేరు మెడికల్ కాలేజీలు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన కాలేజీలన్నీ దాదాపు పునాదులు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి.

ఈ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్న కూటమి పార్టీల నేతలు జగన్ కట్టించిన కాలేజీల స్థితి ఇది అంటూ సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన జనం కూడా వైసీపీ నేతల వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, శుక్రవారం వైసీపీ కీలక నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ తమ అనుచరులతో కలిసి నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఇక్కడ కూడా కొన్ని ఫ్లోర్ల మేర శ్లాబ్ అయితే వేశారు గానీ, ఇంకా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి.

ఇదే వీడియోను వైసీపీ యాక్టివిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. ఈ వీడియోను చూసిన వారు ఇది కూడ మొండిగోడలతోనే ఉంది కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వెరసి, కట్టని కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యిందని చెబితే ఇలాగే అభాసుపాలు అవుతారని చెప్పక తప్పదు.

This post was last modified on September 12, 2025 10:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

58 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago