సుప్రీంకోర్టు పరిధిలో కొన్ని విషయాలపై ఆంక్షలు విధిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వీధి కుక్కలు సుప్రీంకోర్టు ఆవరణలోకి రాకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కోర్టు సిబ్బంది ఎవరూ కుక్కలకు ఆహారం పెట్టరాదని కూడా కోర్టు నిషేధం విధించింది. వీధికుక్కలు లోపలికి రాకుండా సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ఈ పరంపరలో తాజాగా సాధారణ వ్యక్తుల నుంచి న్యాయ వాదుల వరకు అనుసరించాల్సిన విధానాలపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు తిరిగే ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్గా పేర్కొంటారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ముఖ ద్వారా నుంచి కోర్టు ఆవరణకు ఉన్నా ఆరు మార్గాలను కూడా హై సెక్యూరిటీ జోన్లుగానే పేర్కొంటారు. వీటి దగ్గర నిలబడి మీడియా కథనాలు, ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తుంది. అదేవిధంగా కోర్టుకు వచ్చేవారు ఫొటోలు తీసుకుంటారు. సెల్ఫీలు తీసుకుంటారు. కొందరు యూట్యూబర్లు వీడియోలు, రీల్స్ కూడా చేస్తుంటారు. ఇక, ఏదైనా సంచలన కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇస్తే.. జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు కూడా ప్రత్యక్ష ప్రసారాలను అక్కడి నుంచే ఇస్తారు.
అయితే.. ఇలా చేయడం ద్వారా కోర్టు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. తాజాగా వాటన్నింటిపైనా నిషేధం విధించింది. మీడియా ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష ప్రసారాలను హైసెక్యూరిటీ జోన్లో నిషేధించారు. అదేవిధంగా యూట్యూబర్లకు అసలు అనుమతి లేదని పేర్కొన్నారు. ఫోన్స్, కెమెరా, ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ వంటి వాటిని కూడా అనుమతించరాదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఎలాంటి సెల్పీలు తీసుకునే అవకాశం లేదని పేర్కొనడం గమనార్హం.
ఏం జరుగుతుంది?
ఒకవేళ.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే.. మీడియా సంస్థలపై నెల రోజుల పాటు నిషేధం విధిస్తారు. వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. న్యాయవాదులను నెల రోజుల పాటు బార్ నుంచి సస్పెండ్ చేస్తారు. కోర్టు సిబ్బంది, రిజిస్ట్రీ, ఉన్నత అధికారులు ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఎవరు సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ తీసినా.. నిరోధించే హక్కు, అధికారాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
This post was last modified on September 12, 2025 6:54 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…