Political News

‘చూసి ర‌మ్మంటే.. తీసుకొచ్చాడు.. శ‌భాష్‌’

సీఎం చంద్ర‌బాబు అంటే.. ప‌నిరాక్ష‌సుడ‌నే పేరు తెచ్చుకున్నారు. స‌రే.. ఆయ‌న సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఆయ‌న ద‌గ్గ‌ర ప్ర‌శంస‌లు ద‌క్కాలంటే.. మాట‌లు కాద‌ని అంటారు నాయ‌కుల నుంచి అధికారుల వ‌ర‌కు కూడా. దీనికి కార‌ణం.. అంత ట‌ఫ్ వ‌ర్క్‌ను ఆయ‌న అప్ప‌గించ‌డ‌మే కాదు, అంతే నిశితంగా కూడా గ‌మ‌నిస్తారు. ఎంతో కృషి చేస్తే త‌ప్ప‌.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కులు సంపాయించుకోవ‌డం అంత ఈజీ కాదు. తాజాగా ఆఘ‌న‌త‌ను సాధించారు .మంత్రి నారా లోకేష్‌. ఆయ‌న‌కు తాజాగా అప్ప‌గించిన ప‌నిలో స‌క్సెస్ అయ్యారు.

నేపాల్‌లో నెల‌కొన్న అల్ల‌ర్లు, ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో అక్క‌డ‌ చిక్కుకున్న తెలుగు వారికి భ‌రోసా నింప‌డంతో పాటు.. వారిని సుర‌క్షితంగా తీసుకువ‌చ్చే బాధ్య‌త‌ను సీఎం చంద్ర‌బాబు మంత్రి నారా లోకేష్‌కు అప్ప‌గించారు. దీంతో రంగంలోకి దిగిన నారా లోకేష్ .. కేంద్రంలోని పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉండి.. నిరంత‌రం సమీక్షించారు. నేపాల్‌లో చిక్కుకున్న వారిని కూడా ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి సంప్ర‌దించారు. వీడియో కాల్స్ చేశారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు., ఈ క్ర‌మంలోనే భార‌త ప్ర‌భుత్వం ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల‌ను ఏర్పాటు చేసింది.

ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఒక విమానాన్ని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసి.. ఢిల్లీ నుంచి విశాఖ‌కు.. ఇక్క‌డ నుంచి తిరుప‌తి, క‌డ‌ప జిల్లాల‌కు న‌డిపింది. తాజాగా 145 మంది ఒక్క ఏపీకి చెందిన వారే.. విశాఖ‌కు చేరుకున్నారు. వారిలో 105 మంది ఒక్క ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు(విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం) చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారిలో చిత్తూరు, క‌డ‌ప జిల్లాల‌కు చెందిన వారు ఉన్నారు. వీరిని అదే విమానంలో క‌డ‌ప‌కు త‌ర‌లించారు. కాగా.. విమానాశ్ర‌యానికి చేరుకున్న వారిని(గురువారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో) ప్ర‌త్యేక కార్లు, బ‌స్సుల్లో వారి వారి ఇళ్ల‌కు చేర్చారు. వారికి విమానాశ్ర‌యంలో తాగునీరు, ఆహారం అందించారు.

సో.. మొత్తంగా.. నేపాల్ ఘ‌ట‌న‌లో చిక్కుకున్న తెలుగువారిని సుర‌క్షితంగా ఏపీకి తీసుకువ‌చ్చే విష‌యంలో మంత్రి నారా లోకేష్ చూపిన చొర‌వ‌, ఉత్సాహం.. అప్ప‌గించిన ప‌నిని అర్జునుడిగా పూర్తి చేసిన విధంగా వంటివి చంద్ర‌బాబుకు మంత్ర ముగ్ధుడిని చేశాయి. దీంతో ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. “చూసి ర‌మ్మంటే.. తీసుకొచ్చాడు.. శ‌భాష్‌” అంటూ మంత్రి నారా లోకేష్‌ను అభినందించారు. అదేవిధంగా ఆయ‌న‌కు స‌హాయ‌కారులుగా ఉన్న మంత్రులు అనిత‌, దుర్గేష్‌ల‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. మొత్తంగా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారు 90 శాతం మంది చేరుకున్న‌ట్టేన‌ని అధికారులు తెలిపారు.

This post was last modified on September 12, 2025 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

8 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

32 minutes ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

1 hour ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

6 hours ago