Political News

కట్టడి కుదరదు: తెలంగాణ హైకోర్టు తీర్పు చెబుతున్న పాఠం ఏంటి?

సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న వారికి కంటిపై కునుకు పట్టనివ్వని అంశంగా మారింది. తాము అంతా బాగానే చేస్తున్నామనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం తమపై దుమ్మెత్తి పోస్తున్నారని అధికార పక్షాలు వాపోతున్నాయి. ఇక అంతా బాగుంటే ప్రజలు ఎందుకు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు అన్నది సామాజిక ఉద్యమకారులు, తటస్థుల మాట. దీంతో ప్రభుత్వాలకు సోషల్ మీడియా అంటేనే వెగటు పుడుతోంది. ఫలితంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెడుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారం తెలంగాణలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి చేసిన విమర్శనాత్మక పోస్టులపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిపై సదరు వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పోలీసులపై విరుచుకుపడింది. “స్పృహ ఉందా?” అని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. “కేసులు పెట్టడం అంటే కళ్ళు మూసుకుని పెడుతున్నారా? ఏది కేసో ఏది కాదో తెలియని స్థితిలో ఉన్నారా?” అని నిప్పులు చెరిగింది. సోషల్ మీడియాలో రాజకీయపరమైన విమర్శలు చేయడం తప్పుకాదన్న గత సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది.

దాంతో ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కేవలం విమర్శనాత్మక పోస్టుల కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడమే ఆరోపణలుగా ఉంటేనే విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అంతేకాదు, ముందుగా విచారణ చేపట్టకుండానే కేసులు నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

స్వీయ నియంత్రణ ముఖ్యం!

సామాజిక మాధ్యమానికి ముకుతాడు వేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. ఐటీ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ దీనిని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో మార్పులు చేసింది. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శల కారణంగా నమోదైన కేసులు కూడా ఎత్తేయాలని ఆదేశించింది.

అయితే స్వీయ నియంత్రణ అవసరం లేదా? అంటే ఖచ్చితంగా కావాలి. సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలతో విరుచుకుపడడం సరికాదని అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నా, రేపు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. స్వేచ్ఛ మంచిదే అయినా, దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ప్రతి బాధ్యతాయుత పౌరుడు గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

This post was last modified on September 11, 2025 6:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

22 minutes ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

2 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

5 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago