Political News

కట్టడి కుదరదు: తెలంగాణ హైకోర్టు తీర్పు చెబుతున్న పాఠం ఏంటి?

సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న వారికి కంటిపై కునుకు పట్టనివ్వని అంశంగా మారింది. తాము అంతా బాగానే చేస్తున్నామనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం తమపై దుమ్మెత్తి పోస్తున్నారని అధికార పక్షాలు వాపోతున్నాయి. ఇక అంతా బాగుంటే ప్రజలు ఎందుకు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు అన్నది సామాజిక ఉద్యమకారులు, తటస్థుల మాట. దీంతో ప్రభుత్వాలకు సోషల్ మీడియా అంటేనే వెగటు పుడుతోంది. ఫలితంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెడుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారం తెలంగాణలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి చేసిన విమర్శనాత్మక పోస్టులపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిపై సదరు వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పోలీసులపై విరుచుకుపడింది. “స్పృహ ఉందా?” అని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. “కేసులు పెట్టడం అంటే కళ్ళు మూసుకుని పెడుతున్నారా? ఏది కేసో ఏది కాదో తెలియని స్థితిలో ఉన్నారా?” అని నిప్పులు చెరిగింది. సోషల్ మీడియాలో రాజకీయపరమైన విమర్శలు చేయడం తప్పుకాదన్న గత సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది.

దాంతో ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కేవలం విమర్శనాత్మక పోస్టుల కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడమే ఆరోపణలుగా ఉంటేనే విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అంతేకాదు, ముందుగా విచారణ చేపట్టకుండానే కేసులు నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

స్వీయ నియంత్రణ ముఖ్యం!

సామాజిక మాధ్యమానికి ముకుతాడు వేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. ఐటీ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ దీనిని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో మార్పులు చేసింది. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శల కారణంగా నమోదైన కేసులు కూడా ఎత్తేయాలని ఆదేశించింది.

అయితే స్వీయ నియంత్రణ అవసరం లేదా? అంటే ఖచ్చితంగా కావాలి. సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలతో విరుచుకుపడడం సరికాదని అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నా, రేపు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. స్వేచ్ఛ మంచిదే అయినా, దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ప్రతి బాధ్యతాయుత పౌరుడు గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

This post was last modified on September 11, 2025 6:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

23 minutes ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

30 minutes ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

39 minutes ago

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

2 hours ago

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…

2 hours ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

2 hours ago