Political News

కట్టడి కుదరదు: తెలంగాణ హైకోర్టు తీర్పు చెబుతున్న పాఠం ఏంటి?

సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న వారికి కంటిపై కునుకు పట్టనివ్వని అంశంగా మారింది. తాము అంతా బాగానే చేస్తున్నామనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం తమపై దుమ్మెత్తి పోస్తున్నారని అధికార పక్షాలు వాపోతున్నాయి. ఇక అంతా బాగుంటే ప్రజలు ఎందుకు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు అన్నది సామాజిక ఉద్యమకారులు, తటస్థుల మాట. దీంతో ప్రభుత్వాలకు సోషల్ మీడియా అంటేనే వెగటు పుడుతోంది. ఫలితంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెడుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారం తెలంగాణలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి చేసిన విమర్శనాత్మక పోస్టులపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటిపై సదరు వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పోలీసులపై విరుచుకుపడింది. “స్పృహ ఉందా?” అని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. “కేసులు పెట్టడం అంటే కళ్ళు మూసుకుని పెడుతున్నారా? ఏది కేసో ఏది కాదో తెలియని స్థితిలో ఉన్నారా?” అని నిప్పులు చెరిగింది. సోషల్ మీడియాలో రాజకీయపరమైన విమర్శలు చేయడం తప్పుకాదన్న గత సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది.

దాంతో ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కేవలం విమర్శనాత్మక పోస్టుల కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడమే ఆరోపణలుగా ఉంటేనే విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అంతేకాదు, ముందుగా విచారణ చేపట్టకుండానే కేసులు నమోదు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

స్వీయ నియంత్రణ ముఖ్యం!

సామాజిక మాధ్యమానికి ముకుతాడు వేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. ఐటీ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ దీనిని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో మార్పులు చేసింది. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శల కారణంగా నమోదైన కేసులు కూడా ఎత్తేయాలని ఆదేశించింది.

అయితే స్వీయ నియంత్రణ అవసరం లేదా? అంటే ఖచ్చితంగా కావాలి. సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలతో విరుచుకుపడడం సరికాదని అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నా, రేపు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. స్వేచ్ఛ మంచిదే అయినా, దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ప్రతి బాధ్యతాయుత పౌరుడు గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

2 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

5 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

7 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

8 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

8 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

8 hours ago