అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ సిక్స్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసకర పాలన మొదలుబెట్టారని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టివేసిందనిఅన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను తరిమేశారని, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా ఇబ్బందిపెట్టారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 93 పథకాలను నిలిపివేసిందని, అందుకే, పేద, మధ్యతరగతి జీవితాలలో మార్పు తెచ్చేందుకు సూపర్ సిక్స్ హామీ ఇచ్చామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు కూటమికి ఇచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ప్రజలను ప్రశంసించారు.
ఈ సభ రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సూపర్ సిక్స్ ను అవహేళన చేశారని, పింఛన్ల పెంపు అసాధ్యమని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని , మెగా డీఎస్సీ సాధ్యం కాదని విష ప్రచారం చేశారని, దీపం వెలగదు… ఫ్రీ బస్సు కదలదు అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని చెప్పారు. అయితే, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, అందుకే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభ ఏర్పాటు చేశామని చెప్పారు.
15 నెలల పాలనలో సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు అనంతపురానికి వచ్చామని, తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీ శక్తులకు, యువకిషోరాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, నేపాల్ లో ఆందోళనలు జరుగుతున్నాయని, అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు మంత్రి లోకేశ్కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు.
This post was last modified on September 10, 2025 6:05 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…