అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ సిక్స్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసకర పాలన మొదలుబెట్టారని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టివేసిందనిఅన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను తరిమేశారని, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా ఇబ్బందిపెట్టారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 93 పథకాలను నిలిపివేసిందని, అందుకే, పేద, మధ్యతరగతి జీవితాలలో మార్పు తెచ్చేందుకు సూపర్ సిక్స్ హామీ ఇచ్చామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు కూటమికి ఇచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ప్రజలను ప్రశంసించారు.
ఈ సభ రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సూపర్ సిక్స్ ను అవహేళన చేశారని, పింఛన్ల పెంపు అసాధ్యమని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని , మెగా డీఎస్సీ సాధ్యం కాదని విష ప్రచారం చేశారని, దీపం వెలగదు… ఫ్రీ బస్సు కదలదు అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని చెప్పారు. అయితే, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, అందుకే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభ ఏర్పాటు చేశామని చెప్పారు.
15 నెలల పాలనలో సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు అనంతపురానికి వచ్చామని, తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీ శక్తులకు, యువకిషోరాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, నేపాల్ లో ఆందోళనలు జరుగుతున్నాయని, అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు మంత్రి లోకేశ్కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు.
This post was last modified on September 10, 2025 6:05 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…