ఏపీలో పదవుల పందేరంలో హైలెట్గా నిలిచే వార్త ఇది!. నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఉన్న ఒత్తిళ్లకు ఇది నిలువుటద్దంగా మారుతోంది. ప్రస్తుతం టీడీపీలో అనేక మంది నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. వీరిని సంతృప్తి పరిచేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డైరెక్టర్లను నియమిస్తూ.. జంబో కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. ఒకరకంగా చూస్తే.. కార్పొరేషన్లో సిబ్బంది కంటే కూడా.. డైరెక్టర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కార్పొరేషన్లకు ఒక్కొక్క చైర్మన్నే నియమించినా.. దీనికి దాదాపు సత్సమానమైన డైరెక్టర్ల పదవి విషయంలో రాజీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో డైరెక్టర్లను నియమిస్తూ.. సంతృప్తి పరిచే ప్రక్రియకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కార్పొరేషన్లకు ఏకంగా 51 మంది డైరెక్టర్లను నియమించారు. నిజానికి ఒక్క కార్పొరేషన్కు ఒక చైర్మన్, ఒక డైరెక్టర్ ఉంటారు.
కానీ, చిత్రంగా ఒక్కొక్క కార్పొరేషన్కు 15-20 మంది డైరెక్టర్లను నియమించారు. దీంతో పదవులు పొందిన వారు హ్యాపీగా ఫీలవుతున్నా.. కార్పొరేషన్లలో వారికి సీట్లు కేటాయించడంతోపాటు అధికారాలు అప్పగించే విషయంలో మాత్రం సతమతం కావడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో రెండు మాసాల కిందట.. 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. అప్పట్లోనూ ఒక్కొక్క కార్పొరేషన్కు 12 మందిని డైరెక్టర్లుగా నియమించడం గమనార్హం.
తాజాగా ఏం జరిగింది?
కొసమెరుపు: మరి ఇంత మంది డైరెక్టర్లు ఏం చేస్తారో? వారికి అప్పగించే పనులు ఏంటో? వారికి కేటాయించే కార్యాలయాలు ఎక్కడో? అనేది మాత్రం సర్కారు చెప్పలేదు. మొత్తంగా పదవులు ఇచ్చాం.. అంటే.. ఇచ్చేశాం! అన్నట్టుగా సర్కారు వ్యవహరిం చిందన్న విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on September 9, 2025 9:44 am
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…