ఏపీలో పదవుల పందేరంలో హైలెట్గా నిలిచే వార్త ఇది!. నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఉన్న ఒత్తిళ్లకు ఇది నిలువుటద్దంగా మారుతోంది. ప్రస్తుతం టీడీపీలో అనేక మంది నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. వీరిని సంతృప్తి పరిచేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డైరెక్టర్లను నియమిస్తూ.. జంబో కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. ఒకరకంగా చూస్తే.. కార్పొరేషన్లో సిబ్బంది కంటే కూడా.. డైరెక్టర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కార్పొరేషన్లకు ఒక్కొక్క చైర్మన్నే నియమించినా.. దీనికి దాదాపు సత్సమానమైన డైరెక్టర్ల పదవి విషయంలో రాజీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో డైరెక్టర్లను నియమిస్తూ.. సంతృప్తి పరిచే ప్రక్రియకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కార్పొరేషన్లకు ఏకంగా 51 మంది డైరెక్టర్లను నియమించారు. నిజానికి ఒక్క కార్పొరేషన్కు ఒక చైర్మన్, ఒక డైరెక్టర్ ఉంటారు.
కానీ, చిత్రంగా ఒక్కొక్క కార్పొరేషన్కు 15-20 మంది డైరెక్టర్లను నియమించారు. దీంతో పదవులు పొందిన వారు హ్యాపీగా ఫీలవుతున్నా.. కార్పొరేషన్లలో వారికి సీట్లు కేటాయించడంతోపాటు అధికారాలు అప్పగించే విషయంలో మాత్రం సతమతం కావడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో రెండు మాసాల కిందట.. 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. అప్పట్లోనూ ఒక్కొక్క కార్పొరేషన్కు 12 మందిని డైరెక్టర్లుగా నియమించడం గమనార్హం.
తాజాగా ఏం జరిగింది?
కొసమెరుపు: మరి ఇంత మంది డైరెక్టర్లు ఏం చేస్తారో? వారికి అప్పగించే పనులు ఏంటో? వారికి కేటాయించే కార్యాలయాలు ఎక్కడో? అనేది మాత్రం సర్కారు చెప్పలేదు. మొత్తంగా పదవులు ఇచ్చాం.. అంటే.. ఇచ్చేశాం! అన్నట్టుగా సర్కారు వ్యవహరిం చిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…