ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సీనియర్ నాయకులు పలువురు సోమవారం భేటీ అయ్యారు. ఆయన నిర్ణయం మేరకు ఈ ఎన్నికల్లో ఓటుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
“ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిది కాదని మాకు కూడా తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.
“అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు తెలంగాణ సమాజానికి, రాష్ట్రానికి కూడా ద్రోహం చేశాయి. ప్రస్తుతం రైతులను రెండు పార్టీల ప్రభుత్వాలు మోసం చేశాయి. అందుకే ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలనే దరంగా ఉన్నాం” అని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ తరఫున సుదర్శన్ రెడ్డి, బీజేపీ తరఫున రాధాకృష్ణన్ బరిలో ఉన్నారని, అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ రెండు పార్టీలు రాజీపడుతున్నాయన్నారు. 78 లక్షల మందికి పైగా రైతులు ఇప్పుడు అగచాట్లు పడుతున్నారని, వారికి కనీసం ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాయం అందించడం లేదన్నారు.
యూరియా సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగానికి సంఘీభావంగా ఉండేందుకే తాము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కేటీఆర్ తెలిపారు.
“ఒకవేళ నోటా ఉంటే దానికే తాము వేసేవారం. కానీ ప్రస్తుతం ఎన్నికల తీరు బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీనిలో నోటా ఉండదు. ఈ క్రమంలో మేం ఎన్నికలకు దూరంగా ఉంటున్నాం. మాకు ఎవరూ బాస్లు లేరు, ప్రజలే మాకు బాస్లు. అందుకే ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం” అని వివరించారు.
సిగ్గుందా?
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సీఎంకు సిగ్గుందా?” అని ప్రశ్నించారు. హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ విషయంపై మహారాష్ట్ర పోలీసులు నెల రోజులుగా ఇక్కడ కార్మికులుగా చేరి ఈ గుట్టును ఛేదించారని, మరి రాష్ట్ర సర్కారు ఏమైందని ఆయన ప్రశ్నించారు.
“మీ ఈగల్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెల రోజులు ఇక్కడ ఆపరేషన్ చేస్తే ప్రభుత్వ యంత్రాంగం ఏమైంది? కనీసం మహా పోలీసులు రాష్ట్రానికి సమాచారం ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు.
This post was last modified on September 8, 2025 10:37 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…