బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తొత్తులుగా మారుతున్నారని మీడియా సంస్థలపై ఆయన నిప్పులు చెరిగారు. అయితే.. ప్రజలు కూడా చూస్తున్నారని.. ఈ విషయం తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మీడియాపై కూడా ఒత్తిడి తెస్తోందని, కొందరు యజమానులు లొంగిపోయారని, అందుకే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.
మూసీ నది ప్రక్షాళన అంటూ.. వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి దోచుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్లోని చర్లపల్లిలోనే 12 వేల కిలోల డ్రగ్స్ తయారు అవుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్టు సర్కారు వ్యవహరించిందని.. దీని వెనుక కూడా భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారాయనని.. దీనిలోనూ సీఎం రేవంత్ కు వాటాలు అందాయని తాము అనుమానిస్తున్నామని.. అందుకే మహారాష్ట్ర పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా ఇక్కడ నెల రోజులు ఆపరేషన్ చేపట్టారని చెప్పారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు..అక్కడ అవినీతి జరిగింది.. ఇక్కడ అవినీతి జరిగిందని రాసిన పత్రికలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఏమయ్యారని అన్నారు. ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇచ్చే యాడ్స్కు తొత్తులుగా మారారని.. అయితే.. ఇవన్నీ తామే కాదు.. ప్రజలు కూడా గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా.. మీడియా తన తీరును మార్చుకోవాలని సూచించారు.
“ప్రజలు కేవలం మమ్మల్నే కాదు.. మీడియాను కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు రాయరు. ఎంతసేపూ.. అధికారం పోయిన కేసీఆర్ ఏం చేస్తున్నడో రాస్తారు. వేల కోట్లు, వందల కోట్లు మింగుతున్నా.. అటువైపు కన్నెత్తి చూడరు. తొత్తులుగా మారారా?. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మూసీ కుంభకోణంపై ఎంత మంది వార్తలు రాస్తారో మేమూ చూస్తాం.” అని వ్యాఖ్యానించారు.
This post was last modified on September 8, 2025 3:26 pm
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…