ఇదొక షాకింగ్ పరిణామం. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మంగళవారం దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్న ఈ పోరులో తటస్థ పార్టీలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా.. వీరిని దూరంగా ఉంచే ప్రయత్నాల్లో బీజేపీ నాయకులు తలమునకలయ్యారు.
తమకు ఓటు వేయకపోయినా.. ఫర్వాలేదు.. కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థికి మాత్రం ఓటు వేయొద్దని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగానే.. బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజాగా బీఆర్ఎస్ ఓ ప్రకటన జారీ చేసింది. తాము ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని పేర్కొంది. అయితే.. దీనికి బలమైన కారణాలు ఏవీ పేర్కొనలేదు. వాస్తవానికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 4 ఓట్లు ఉన్నాయి. లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోయినా.. రాజ్యసభలో ఉంది.
రాజ్యసభలో బీఆర్ఎస్ తరఫున పార్థసారథిరెడ్డి, కెఆర్ సురేష్రెడ్డి, దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్రలు ఉన్నారు. వీరి ఓట్లు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఇవి కాంగ్రెస్కు పడితే.. ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అయితే.. తాజా నిర్ణయంతో వీరంతా ఎన్నికలకు దూరంగా ఉంటారు. అంటే.. ఒకరకంగా అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బీఆర్ఎస్ మేలు చేస్తోందన్న వాదన వినిపించేలా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ తరఫున సుదర్శన్ రెడ్డి గెలుస్తారా.. గెలవరా.. అనేది పక్కన పెడితే.. అసలు పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేకపోతే.. అది ఎన్డీయేకు మేలు చేసినట్టే కదా.. అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం ద్వారా.. పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తోందని చెబుతున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి వాదన వినిపిస్తారో చూడాలి.
This post was last modified on September 8, 2025 2:14 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…