Political News

ముందు మీరు.. త‌ర్వాతే.. నేను: జ‌గ‌న్ తీరుపై వైసీపీ విస్మ‌యం

‘జ‌గ‌న్ అంటే జ‌నం-జ‌నం అంటే జ‌గ‌న్‌’ ఒక‌ప్పుడు వైసీపీలో వినిపించిన నినాదం ఇది. అయితే.. రాను రాను ఈ నినాదం రూటు మారుతోంది. జ‌నం కోసం వైసీపీ చేస్తున్న కార్య‌క్ర‌మాలే త‌గ్గిపోగా.. ఇప్పుడు అర‌కొర‌గా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా జ‌గ‌న్ లేకుండా పోతున్నారు. ఆయ‌న తాపీగా తాడేప‌ల్లిలోని ఆఫీసులో కూర్చొని కునుకు తీస్తుండ‌గా.. ఇత‌ర నాయ‌కులు, కార్యకర్త‌లు రోడ్డెక్కాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా కార్య‌క్ర‌మాలు మొక్కుబ‌డి ఫొటో సెష‌న్లుగా మారుతున్నాయి. నాయ‌కులు రావ‌డం.. ఇలా ఫొటోల‌కు ఫోజులు ఇచ్చి.. వెళ్లిపోవ‌డంతోనే కార్య‌క్ర‌మాలు ముగిసిపోతున్నాయి.

తాజాగా ‘అన్న‌దాత పోరు’ పేరుతో వైసీపీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 9న అంటే.. మంగ‌ళ‌వారం.. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించింది. రైతులు ప‌డుతున్న ఇబ్బందులు, యూరియా కొర‌త‌, రైతుల క‌ష్టాల‌ను ప్ర‌ధానంగా తీసుకుని ఈ నిర‌స‌న‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.అయితే.. దీనికికూడా జ‌గ‌న్ రావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. “ఇది.. మ‌నంద‌రం క‌లిసి స‌క్సెస్ చేయాల్సిన కార్య‌క్ర‌మం. జ‌గ‌న్ వేరే స‌మ‌యంలో వేరే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఇది మ‌న‌కు మ‌నం నిర్ణ‌యించుకున్న కార్య‌క్ర‌మం” అని పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల చీఫ్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గీతోప‌దేశం చేశారు.

మంగ‌ళ‌వారం నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీవో ఆఫీసుల ముందు.. పార్టీ నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తారు. రైతుల‌తో కూర్చుని ధ‌ర్నాలు చేస్తారు. అయితే.. ఇవ‌న్నీ శాంతి యుతంగానే చేప‌ట్టాల‌ని స‌జ్జ‌ల సూచించారు. ఎక్క‌డా వివాదాల జోలికి పోకూడ‌ద‌న్నారు. ఇక‌, ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆయ‌నే ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మాల‌కు ఉద్య‌మ స్థాయిలో విజృంభించాల్సిన కీల‌క నేత జ‌గ‌న్‌. పార్టీలో ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న నేతృత్వాన్నే కోరుకుంటున్నారు. కానీ, చిత్రంగా జ‌గ‌న్ మాత్రం మౌనంగా ఉంటారు. స‌జ్జ‌ల మాత్రం తెర‌మీదికి వ‌స్తారు.

గ‌తంలోనూ ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు, ఇత‌ర ప‌థ‌కాల‌పై కూడా ఇలానే నిర‌స‌న‌లు చేప‌ట్టినా.. అవి స‌క్సెస్ కాలేదు. జ‌గ‌న్ లేని కార్య‌క్ర‌మాల‌కు మేం వ‌చ్చ‌ది లేద‌ని చాలా జిల్లాల్లో కార్య‌క‌ర్త‌లు భీష్మించారు. దీంతో నాయ‌కులు వారిని బ్ర‌తిమాలి.. బామాలి తెచ్చుకుని ఫొటోల‌కు ఫోజులు, మీడియా ముందు బైట్లు ఇచ్చి మ‌మ అనిపించారు. దీంతో వ్ర‌త‌మూ చెడింది.. ఫ‌లితమూ పోయింది. ఏదో పేరు కోసం.. చేసిన కార్య‌క్ర‌మాలుగానే మిగిలిపోయాయి. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌స్య‌పై క‌దం తొక్కాల్సిన స‌మ‌యంలోనూ జ‌గ‌న్‌.. ఇంట్లో కూర్చుని.. “ముందు మీరు.. త‌ర్వాతే.. నేను” అనే త‌ర‌హాలో చేస్తున్న ప‌నుల‌తో నాయ‌కులు విస్తుబోతున్నారు.

This post was last modified on September 6, 2025 10:04 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

19 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

30 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago