‘జగన్ అంటే జనం-జనం అంటే జగన్’ ఒకప్పుడు వైసీపీలో వినిపించిన నినాదం ఇది. అయితే.. రాను రాను ఈ నినాదం రూటు మారుతోంది. జనం కోసం వైసీపీ చేస్తున్న కార్యక్రమాలే తగ్గిపోగా.. ఇప్పుడు అరకొరగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా జగన్ లేకుండా పోతున్నారు. ఆయన తాపీగా తాడేపల్లిలోని ఆఫీసులో కూర్చొని కునుకు తీస్తుండగా.. ఇతర నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయా కార్యక్రమాలు మొక్కుబడి ఫొటో సెషన్లుగా మారుతున్నాయి. నాయకులు రావడం.. ఇలా ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. వెళ్లిపోవడంతోనే కార్యక్రమాలు ముగిసిపోతున్నాయి.
తాజాగా ‘అన్నదాత పోరు’ పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 9న అంటే.. మంగళవారం.. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఉద్యమించాలని నిర్ణయించింది. రైతులు పడుతున్న ఇబ్బందులు, యూరియా కొరత, రైతుల కష్టాలను ప్రధానంగా తీసుకుని ఈ నిరసనకు రూపకల్పన చేశారు.అయితే.. దీనికికూడా జగన్ రావడం లేదని స్పష్టం చేశారు. “ఇది.. మనందరం కలిసి సక్సెస్ చేయాల్సిన కార్యక్రమం. జగన్ వేరే సమయంలో వేరే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మనకు మనం నిర్ణయించుకున్న కార్యక్రమం” అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి గీతోపదేశం చేశారు.
మంగళవారం నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీవో ఆఫీసుల ముందు.. పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తారు. ప్లకార్డులు ప్రదర్శిస్తారు. రైతులతో కూర్చుని ధర్నాలు చేస్తారు. అయితే.. ఇవన్నీ శాంతి యుతంగానే చేపట్టాలని సజ్జల సూచించారు. ఎక్కడా వివాదాల జోలికి పోకూడదన్నారు. ఇక, ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయనే ఆవిష్కరించారు. వాస్తవానికి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు ఉద్యమ స్థాయిలో విజృంభించాల్సిన కీలక నేత జగన్. పార్టీలో ప్రతి ఒక్కరూ ఆయన నేతృత్వాన్నే కోరుకుంటున్నారు. కానీ, చిత్రంగా జగన్ మాత్రం మౌనంగా ఉంటారు. సజ్జల మాత్రం తెరమీదికి వస్తారు.
గతంలోనూ ఫీజు రీయింబర్స్మెంటు, ఇతర పథకాలపై కూడా ఇలానే నిరసనలు చేపట్టినా.. అవి సక్సెస్ కాలేదు. జగన్ లేని కార్యక్రమాలకు మేం వచ్చది లేదని చాలా జిల్లాల్లో కార్యకర్తలు భీష్మించారు. దీంతో నాయకులు వారిని బ్రతిమాలి.. బామాలి తెచ్చుకుని ఫొటోలకు ఫోజులు, మీడియా ముందు బైట్లు ఇచ్చి మమ అనిపించారు. దీంతో వ్రతమూ చెడింది.. ఫలితమూ పోయింది. ఏదో పేరు కోసం.. చేసిన కార్యక్రమాలుగానే మిగిలిపోయాయి. ఇక, ఇప్పుడు కీలకమైన సమస్యపై కదం తొక్కాల్సిన సమయంలోనూ జగన్.. ఇంట్లో కూర్చుని.. “ముందు మీరు.. తర్వాతే.. నేను” అనే తరహాలో చేస్తున్న పనులతో నాయకులు విస్తుబోతున్నారు.
This post was last modified on September 6, 2025 10:04 pm
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…