తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన తోడబుట్టిన చెల్లి పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్… తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె నుంచి లాగేసుకునే యత్నాలకు పదును పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే తొలి అడుగు కూడా పడిందని చెప్పాలి. జాగృతి ఏర్పాటు సందర్భంగా కవితతో పాటు కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలను కేటీఆర్ రంగంలోకి దించారు.
కేటీఆర్ రంగంలోకి దింపిన నేతల్లో రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం బిక్షపతి తదితరులు గురువారం ఏకంగా హైదరాబాద్ లో మీడియా సమావేశాన్నే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు కవిత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమను నడిరోడ్డుపై పడేసిందని రాజీవ్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎవరిని అడిగి ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కూడా ఆయన ప్రశ్నించారు. జాగృతి ఆవిర్భావంలో కవితతో కలిసి సాగామని, సంస్థలో కవితకు ఎంత పాత్ర ఉందో తమకూ అంతే పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని రాజీవ్ సాగర్… అసలు తెలంగాణ జాగృతి తమదేనని, సంస్థ తరఫున కార్యకలాపాలు కొనసాగించేందుకు తమకే అర్హత ఉందని కూడా చెప్పారు. ఇంకా చెప్పాలంటే… జాగృతిపై కవితకు ఎలాంటి హక్కు లేదని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కు అనుబంధంగానే జాగృతి ఏర్పాటు అయ్యిందన్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్టే తాము నడుచుకుంటామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమాలకు తావు లేదని తెలిపారు.
కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే జాగృతిలో చీలిక రావడం గమనార్హం. వాస్తవానికి హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఎర్రవలి ఫామ్ హౌస్ లోని తండ్రి చెంతకు చేరిన కేటీఆర్ గడచిన 5 రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో కవితపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత కూడా అక్కడే ఉంటూ సుధీర్ఘ మంతనాలు జరుపుతున్న కేటీఆర్… కవితను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరింత కఠిన నిర్ణయాలు అవసరమని బావించినట్లున్నారు. అందులో బాగంగానే జాగృతిని కూడా కవిత చేతిలో నుంచి లాగేసేందుకు వ్యూహం రచించినట్టు సమాచారం.
This post was last modified on September 5, 2025 2:34 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…