Political News

అంబటి వంతూ వచ్చేసింది!

ఏపీలో కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, అందులో భాగంగానే వైసీపీ నేతలను వరుసబెట్టి అరెస్టు చేస్తోందని ఆరోపిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తననూ అరెస్టు చేసుకోండి అంటూ చాలా రోజులుగా సవాల్ విసురుతున్నారు. అంబటి సవాళ్లు ఇప్పుడు నిజమైపోయాయి. అంబటిపై విచారణకు ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ వ్యవహారంలో విచారణ మొదలు అయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ పాలనలో అంబటి రాంబాబు రెండున్నరేళ్ల పాటు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. అయితే ఈ ఆరోపణలపై తాజాగా అటు ప్రభుత్వంతో పాటు ఇటు విజిలెన్స్ శాఖకు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా అంబటిపై వి,చారణకు ఆదేశిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

అయినా అంబటిపై వెల్లువెత్తిన విమర్శలు ఏమిటన్న విషయానికి వస్తే… వైసీపీ హయాంలో ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఒకే చోట స్థలాలు ఇచ్చేలా ప్రైవేటు స్థలాలను కొన్నారు. ఇలా కొన్న భూములున్నీ కూడా వైసీపీ నేతల నుంచే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భూములను ఆయా నేతలు అతి తక్కువ ధరలకు కొని ప్రభుత్వానికి మాత్రం అత్యదిక ధరలకు అందించారు. ఈ వ్యవహారంలో అంబటి భారీగా చక్రం తిప్పారట. ఎకరాను రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి మాత్రం రూ.30 లక్షలకు అమ్మారట. ఇక ప్రైవేట్ వ్యాపారులనూ ఆయన బెదిరించి వసూళ్లు సాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై ఇప్పుడు అంబటి విచారణను ఎదుర్కోనున్నారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

4 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

6 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago