Political News

అంబటి వంతూ వచ్చేసింది!

ఏపీలో కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, అందులో భాగంగానే వైసీపీ నేతలను వరుసబెట్టి అరెస్టు చేస్తోందని ఆరోపిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తననూ అరెస్టు చేసుకోండి అంటూ చాలా రోజులుగా సవాల్ విసురుతున్నారు. అంబటి సవాళ్లు ఇప్పుడు నిజమైపోయాయి. అంబటిపై విచారణకు ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ వ్యవహారంలో విచారణ మొదలు అయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ పాలనలో అంబటి రాంబాబు రెండున్నరేళ్ల పాటు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. అయితే ఈ ఆరోపణలపై తాజాగా అటు ప్రభుత్వంతో పాటు ఇటు విజిలెన్స్ శాఖకు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా అంబటిపై వి,చారణకు ఆదేశిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

అయినా అంబటిపై వెల్లువెత్తిన విమర్శలు ఏమిటన్న విషయానికి వస్తే… వైసీపీ హయాంలో ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఒకే చోట స్థలాలు ఇచ్చేలా ప్రైవేటు స్థలాలను కొన్నారు. ఇలా కొన్న భూములున్నీ కూడా వైసీపీ నేతల నుంచే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భూములను ఆయా నేతలు అతి తక్కువ ధరలకు కొని ప్రభుత్వానికి మాత్రం అత్యదిక ధరలకు అందించారు. ఈ వ్యవహారంలో అంబటి భారీగా చక్రం తిప్పారట. ఎకరాను రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి మాత్రం రూ.30 లక్షలకు అమ్మారట. ఇక ప్రైవేట్ వ్యాపారులనూ ఆయన బెదిరించి వసూళ్లు సాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై ఇప్పుడు అంబటి విచారణను ఎదుర్కోనున్నారు.

This post was last modified on September 5, 2025 12:58 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

8 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

8 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

21 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago