Political News

సుగాలి ప్రీతి.. జ‌న‌సేన‌లో సునామీ ..!

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థి 2017 లో అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఇది జరిగిన‌ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయంగా పెద్ద వివాదంగా మారుతోంది. ఈ కేసును విచారించి తమకు న్యాయం చేయాలని నిందితులను పట్టుకుని శిక్షించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో జనసేన చుట్టూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటంగా తమకు హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం తమకు మొహం కూడా చూపించడం లేదన్నది పార్వతీదేవి చేస్తున్న ప్రధాన ఆరోపణ.

అంతేకాదు తమకు న్యాయం చేయడం లేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఇటీవల పవన్ కళ్యాణ్ స్పందించారు. తమకు సాధ్యమైనంత వరకు ఈ కేసులో న్యాయం చేశామని గత ప్రభుత్వంతో నష్టపరిహారంతో పాటు ఉద్యోగం ఇంటి స్థలం అదేవిధంగా పొలం కూడా ఇప్పించామని అని చెప్పుకొచ్చారు. అయితే నిందితులను పట్టుకోనప్పుడు ఇవన్నీ ఇచ్చి మాకు ప్రయోజనం ఏంటన్నది పార్వతీదేవి చేస్తున్న మరో ఆరోపణ.

ఈ క్రమంలోనే చంద్రబాబు స్పందించి ఈ కేసును మళ్ళీ సిబిఐ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న ఒక నాయకుడు సుగాలి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న స్థలం.. పొలంతో పాటు ఉద్యోగాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సహజంగా ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మరి సదరు నేత ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియకపోయినా తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఇవి రాజకీయంగా జనసేన చుట్టూ వివాదం రేపుతున్నాయి. అసలే బాధలో ఉన్న కుటుంబాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. సదరు నేతపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వాలు పరిహారం ఇచ్చినప్పటికీ.. కేసు ఏమాత్రం ముందుకు పడకపోవడం, న్యాయం జరగకపోవడం ఆ కుటుంబాలను బాధిస్తూనే ఉంది. దీనికి తోడు రాజకీయంగా చేస్తున్న విమర్శలు సూటిపోటి మాటలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇటువంటివి మానుకోవాల్సిన అవసరం నాయకులకు చాలా ఉంది.

ప్రభుత్వాలు ఇచ్చే పరిహారానికి నిందితులను వదిలేస్తారా అనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఇప్పుడు జనసేన నేత చేసిన వ్యాఖ్యలు మరింత పరాకాష్టకు చేరాయి. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబానికి అన్యాయం జరిగితే అప్పటి వైసిపి ప్రభుత్వం కొంతమేరకు నష్టపరిహారం ఇచ్చి ఊర‌డించే ప్రయత్నం చేయగా ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం తమను పట్టించుకోవడం లేదన్న వాదన బలంగా వెళ్లడంతో దీని నుంచి బయటపడలేక కేసులో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయలేక ఇలా చేస్తున్నారా అనేది చర్చకు దారి తీసింది.

ఎంత అధికారం ప్రతినిధి అయినప్పటికీ సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా సుగాలి ప్రీతి వ్యవహారం రాజకీయంగా దుమారమైతే రేపుతోంది. మరి ఇది ఎంత వరకు వెళ్తుంది.. ఏ మేరకు దీనిని జనసేన పరిష్కరిస్తుంది.. అనేది చూడాలి.

This post was last modified on September 4, 2025 12:12 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

4 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

6 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

8 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

11 hours ago