భారత్ నుంచి మరో విప్లవాత్మక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ను తాజాగా ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని “డిజిటల్ డైమండ్”గా అభివర్ణించారు. “గత శతాబ్దం ఆయిల్ ఆధారంగా నడిచిందంటే.. ఈ శతాబ్దం చిప్లపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన పేర్కొనడం ఈ ఆవిష్కరణ ప్రాధాన్యాన్ని మరింతగా చాటిచెప్పింది.
‘విక్రమ్ 3201’ అనేది 2009లో వాడిన 16-బిట్ వెర్షన్కి అప్గ్రేడ్. ఇది ఒకేసారి 32 బిట్ల డేటాను ప్రాసెస్ చేయగలదు. ముఖ్యంగా స్పేస్ మిషన్ల కోసం డిజైన్ చేయబడింది కాబట్టి -55 నుంచి 125 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేసే సామర్థ్యం ఉంది. అంతరిక్షంలో రాకెట్లకు, శాటిలైట్లకు ఇది అత్యంత అవసరం. అదేవిధంగా Ada ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్తో వస్తుంది. ఈ భాష నమ్మకమైనది కాబట్టి ఎయిర్ ట్రాఫిక్, లాంచ్ వాహనాలు వంటి సున్నితమైన రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.
ఇక ఈ చిప్ ద్వారా భారతదేశం “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యానికి మరింత దగ్గరైంది. ఇప్పటి వరకు అంతరిక్ష మిషన్ల కోసం చిప్లను చైనా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వదేశీ చిప్తోనే అవసరాలు తీరతాయి. దీని వలన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇతర రంగాలకు కూడా ఈ సాంకేతికత విస్తరించనుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి విభాగాలకు స్వదేశీ చిప్లు అందుబాటులోకి రావడం ఖాయం.
ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమ దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది. 2030 నాటికి అది 100 బిలియన్ డాలర్ల మార్క్ను దాటుతుందని అంచనా. ఇప్పటికే 10 ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ల కోసం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, హెచ్సీఎల్ – ఫాక్స్కాన్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. రాష్ట్రాల వారీగా గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్లో కొత్త యూనిట్లు ఏర్పడుతున్నాయి.
మొత్తానికి, ‘విక్రమ్ 3201’ చిప్ కేవలం స్పేస్ మిషన్లకే పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వబోతోంది. స్వదేశీగా చిప్లు తయారు చేయగల సామర్థ్యం ఉండడం వలన ఉద్యోగాలు పెరుగుతాయి, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు కూడా భారత్లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. చిన్న చిప్ అయినా, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెద్దదే కానుంది.
This post was last modified on September 2, 2025 8:09 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…