Political News

మోడి చెప్పిన ‘డిజిటల్ డైమండ్’ కథ ఏంటి?

భారత్‌ నుంచి మరో విప్లవాత్మక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌ ‘విక్రమ్‌ 3201’ను తాజాగా ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని “డిజిటల్‌ డైమండ్‌”గా అభివర్ణించారు. “గత శతాబ్దం ఆయిల్‌ ఆధారంగా నడిచిందంటే.. ఈ శతాబ్దం చిప్‌లపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన పేర్కొనడం ఈ ఆవిష్కరణ ప్రాధాన్యాన్ని మరింతగా చాటిచెప్పింది.

‘విక్రమ్‌ 3201’ అనేది 2009లో వాడిన 16-బిట్‌ వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌. ఇది ఒకేసారి 32 బిట్ల డేటాను ప్రాసెస్‌ చేయగలదు. ముఖ్యంగా స్పేస్‌ మిషన్‌ల కోసం డిజైన్‌ చేయబడింది కాబట్టి -55 నుంచి 125 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పనిచేసే సామర్థ్యం ఉంది. అంతరిక్షంలో రాకెట్లకు, శాటిలైట్‌లకు ఇది అత్యంత అవసరం. అదేవిధంగా Ada ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ సపోర్ట్‌తో వస్తుంది. ఈ భాష నమ్మకమైనది కాబట్టి ఎయిర్‌ ట్రాఫిక్‌, లాంచ్‌ వాహనాలు వంటి సున్నితమైన రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఇక ఈ చిప్‌ ద్వారా భారతదేశం “ఆత్మనిర్భర్‌ భారత్‌” లక్ష్యానికి మరింత దగ్గరైంది. ఇప్పటి వరకు అంతరిక్ష మిషన్ల కోసం చిప్‌లను చైనా, తైవాన్‌, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వదేశీ చిప్‌తోనే అవసరాలు తీరతాయి. దీని వలన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇతర రంగాలకు కూడా ఈ సాంకేతికత విస్తరించనుంది. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెడికల్‌ పరికరాలు వంటి విభాగాలకు స్వదేశీ చిప్‌లు అందుబాటులోకి రావడం ఖాయం.

ప్రస్తుతం భారత్‌లో సెమీకండక్టర్‌ పరిశ్రమ దాదాపు 50 బిలియన్‌ డాలర్ల విలువ కలిగి ఉంది. 2030 నాటికి అది 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటుతుందని అంచనా. ఇప్పటికే 10 ఫ్యాబ్రికేషన్‌ ప్లాంట్ల కోసం 18 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌సీఎల్‌ – ఫాక్స్‌కాన్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. రాష్ట్రాల వారీగా గుజరాత్‌, అసోం, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్లు ఏర్పడుతున్నాయి.

మొత్తానికి, ‘విక్రమ్‌ 3201’ చిప్‌ కేవలం స్పేస్‌ మిషన్‌లకే పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వబోతోంది. స్వదేశీగా చిప్‌లు తయారు చేయగల సామర్థ్యం ఉండడం వలన ఉద్యోగాలు పెరుగుతాయి, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు కూడా భారత్‌లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. చిన్న చిప్‌ అయినా, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెద్దదే కానుంది.

This post was last modified on September 2, 2025 8:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

1 hour ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

7 hours ago