సెప్టెంబర్ 2 అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం గుర్తుకు వస్తుంది. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ఈ ఘటన జరిగి 16 ఏళ్లు అవుతోంది. తమ సొంత ఎస్టేట్ ఇడుపులపాయలో తండ్రికి సమాధి కట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏటా వైఎస్ వర్థంతి, జయంతి సందర్భంగా అక్కడకు వెళ్లి తండ్రికి నివాళి అర్పిస్తుంటారు. మంగళవారం కూడా అదే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నిన్నటిదాకా ఏపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట కనిపించిన జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి మంగళవారం జగన్ తో కలిసి కనిపించారు.
సోమవారమే కుటుంబ సమేతంగా పులివెందుల చేరుకున్న జగన్… రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడే బస చేశారు. విజయమ్మ కూడా నిన్ననే ఇడుపులపాయ వచ్చినట్లు సమాచారం. మంగళవారం ఉదయమే తండ్రికి నివాళి అర్పించేందుకు బయలుదేరిన జగన్ వెంట ఆయన తల్లి విజయమ్మ కూడా తన భర్తకు నివాళి అర్పించేందుకు సాగారు. ఈ సందర్భంగా వైఎస్ సమాధి వద్ద తన కుమారుడు జగన్ కు విజయమ్మ ఆశీస్సులు కూడా అందజేశారు. జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, జగన్ సమీప బంధువర్గం అంతా కింద మోకాళ్లపై కూర్చోగా… కుర్చీ మీద కూర్చుని విజయమ్మ భర్తకు నివాళి అర్పించారు.
ఆ తర్వాత జగన్ అండ్ కో అక్కడి నుంచి నిష్క్రమించగా… మరికాసేపటికే తండ్రికి నివాళి అర్పించేందుకు షర్మిల తన పిల్లలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగానూ విజయమ్మ అక్కడ కనిపించారు. అయితే జగన్ నివాళిలో ముందు వరుసలో కుర్చీలో కూర్చున్న విజయమ్మ … షర్మిల నివాళిలో మాత్రం వెనుక వరుసలో చాలా దిగాలుగా కూర్చుని కనిపించారు. షర్మిల వెంట ఆమె కుమారుడు, కోడలు, కుమార్తె, కొందరు సమీప బంధువులు ఉన్నారు. ఈ దృశ్యాలు చూసిన వెంటనే విజయమ్మ నిజంగానే షర్మిల జట్టు వీడి జగన్ జట్టులో చేరిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో షర్మిల వెంట ఇడుపులపాయ వచ్చిన విజయమ్మ ఆ సందర్బంగా జగన్ వెంట కనిపించనే లేదు.
అంతేకాకుండా కంపెనీ షేర్ల పంచాయతీ నేపథ్యంలో కుమార్తెతో కలిసి కొడుకుపైనే కోర్టుకు ఎక్కిన విజయమ్మ.. జగన్ అండ్ కో పై ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఆ వ్యాఖ్యలు విన్నవారు ఇకపై విజయమ్మ జగన్ దరి చేరరని భావించారు. కోర్టులో షర్మల, విజయమ్మలకు షాక్ తగిలింది. జగన్ కే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ… విజయమ్మ మంగళవారం తన కుమారుడితో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో కుమార్తెతోనూ ఉన్నా… షర్మిలకు దూరంగా విజయమ్మ కూర్చున్న తీరు చూస్తే జగన్ జట్టులోకి విజయమ్మ చేరిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 2, 2025 2:39 pm
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…