ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు ఆయన గట్టి సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాను ఒంటరిగా వస్తున్నానని, కూటమి పార్టీలు మూకుమ్మడిగా వస్తున్నాయని, అయినా సిద్ధమేనని ఆయన ప్రస్తావించి ప్రజల మధ్యకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ విషయంలో మౌనంగా ఉన్న చంద్రబాబు తాజాగా వైసీపీ నేతలకు సిద్ధం అనే పదంతో గట్టి సవాల్ విసిరారు.
సిద్ధం సిద్ధం అంటూ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా... మీరు సిద్ధమా? అని ప్రశ్నించిన చంద్రబాబు, వైసీపీ నాయకులు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా? అని అన్నారు. అంతేకాదు వైసీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు సిద్ధమా? అని నిలదీశారు.
ఇటీవల జరిగిన కడపలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని, దీనిపై చర్చకు తాము సిద్ధమేనని, మరి వైసీపీ నాయకులు కూడా సిద్ధమేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
అలాగే జగన్ బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్య, విశాఖపట్నం ఎయిర్పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామా, విజయవాడలో జరిగిన గులకరాయి నాటకాలపై కూడా చర్చకు తాము సిద్ధమేనని చెప్పారు. వైసీపీ నాయకులు కూడా సిద్ధమేనా? అని నిలదీశారు. దమ్ముంటే సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
సోమవారం ఆయన ఉమ్మడి కడప (ప్రస్తుతం అన్నమయ్య) జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. పలు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి జీవనోపాధి గురించి వివరాలు అడిగారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తన రాజకీయ జీవితం 45 ఏళ్లు దాటిపోయిందని చెప్పారు. ఏనాడూ తాను విశ్రాంతి తీసుకోలేదని, నిరంతరం పేదలు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం శ్రమించానని తెలిపారు. తన కుటుంబాన్ని కూడా విస్మరించి ప్రజల కోసం పనిచేశానన్నారు.
పేదలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల విషయంలో మరిన్ని పథకాలు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, ఆదాయం పెరగాలని చెప్పారు. దీనికి సంబంధించి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. సంపద సృష్టి జరుగుతోందని, దానిని పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు.
This post was last modified on September 1, 2025 10:37 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…