Political News

భాయ్ నువ్వు రిపోర్టు మొత్తం చదివావా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగాయి. సుమారు చివరి రెండు గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీఆర్ ఎస్ సభ్యులు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పత్రాలను చించేసి విసిరి కొట్టి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయిన తర్వాత ఎంఐఎం సభ్యుడు మైకు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన కమిషన్ రిపోర్టుపై విమర్శలు గుప్పించారు. రిపోర్టు అసమగ్రంగా ఉందని, కేవలం ఒక కాంట్రాక్టర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విచారణ చేసినట్టు అర్థమవుతోందన్నారు. అంతేకాదు ఎలాంటి చర్యలూ సిఫారసు చేయలేదని తెలిపారు. దీనిని ఆధారంగా ఎలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

దీనికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. పలు సందర్భాల్లో ఆయన “భయ్యా, నువ్వు రిపోర్టును పూర్తిగా చదివావా?” అని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి, దుర్వినియోగం జరిగిందని కమిషన్ రిపోర్టు స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. రిపోర్టును పూర్తిగా చదవితే గుండె తరుక్కు పోతుందన్నారు. అనేక దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన పత్రాలను కూడా ఘోష్ కమిషన్‌కు ఇచ్చామని, వారు సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత అన్ని కోణాల్లోనూ విచారించి నివేదిక ఇచ్చారని తెలిపారు.

అవినీతి పరులను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ రిపోర్టు చదివిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలనుకుంటారో, ఎలాంటి విచారణకు ఆదేశించమంటారో చెప్పాలని అక్బరుద్దీన్‌ను కోరారు. అక్బరుద్దీన్ ఎలాంటి విచారణకు ఆదేశించమన్నా ఆదేశిస్తామని చెప్పారు. సీబీఐకి ఇవ్వమన్నా ఇస్తామని, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయమన్నా చేస్తామని అన్నారు. అవినీతి సొమ్మును తిరిగి రాబట్టేందుకు సభ్యులు ఎవ్వరైనా సూచించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మిత్రపక్షం సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. తప్పు చేసి ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదా సమయం వృథా చేయడం సరికాదన్నారు.

మొత్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సభ కొనసాగేలా ఉండటం గమనార్హం. అప్పటి వరకు కూడా బీఆర్ ఎస్ నాయకులు గన్ పార్క్ వద్ద ఆందోళన కొనసాగించారు.

This post was last modified on September 1, 2025 1:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

17 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago