Political News

మోడీ తర్వాత.. ఆ ఛాన్స్ మళ్లీ లోకేష్‌కే!

ఔను.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తర్వాత ఓ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న మంత్రిగా నారా లోకేష్ రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి నారా లోకేష్‌కు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏటా స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం (ఎస్‌వీపీ)ని ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను ఏరికోరి ఆహ్వానిస్తుంది. వారి స్ఫూర్తిని తమ దేశానికి కూడా చాటుతుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రత్యేక ఆహ్వానం పంపించింది. ఎస్‌వీపీలో పాల్గొనాలని కోరింది. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్టు భారత్‌లోని ఆస్ట్రేలియా దౌత్య కార్యాలయం నుంచి మంత్రి నారా లోకేష్‌కు అందిన సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఉత్తమ నాయకుడిగా మరింత గుర్తింపు సాధ్యమవుతుంద‌ని ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

ఎందుకు పిలిచారు?

రాష్ట్రంలో మానవ వనరులు, విద్య, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న సమూల సంస్కరణలు.. ఇష్టపడి చదివే విధానాలను ప్రోత్సహించడం పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం అచ్చరువొందింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను తమ దేశానికి ఆహ్వానించింది. వచ్చే నెలలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. కాగా.. ఉమ్మడి ఏపీ సహా విభజిత ఏపీ నుంచి కూడా ఈ ఆహ్వానం అందుకున్న ఏకైక నాయకుడు నారా లోకేష్ కావడం గమనార్హం.

గతంలో..

గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీకి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలానే ఆహ్వానం పంపింది. ఆయన వెళ్లారు కూడా. 2001లో నిర్వహించిన స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్‌కు మోడీని ఆహ్వానించినట్టు తాజాగా పంపించిన ఆహ్వాన పత్రికలో ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తు చేసింది. ఇప్పుడు భారత్ నుంచి మంత్రి నారా లోకేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

This post was last modified on August 31, 2025 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

25 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

32 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago