Political News

జ‌గ‌న్‌కు అయ్య‌న్న‌ అప్పీల్‌.. ఏమ‌న్నారంటే!

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష‌ (ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు జ‌గ‌న్‌కు అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కీల‌క సూచ‌న చేశారు. అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న‌ను మ‌రోసారి కోరారు. అంతేకాదు.. స‌భ‌కు వ‌స్తే మాట్లాడే స‌మ‌యంలో ఇస్తామ‌న్నారు. స‌భ‌కు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టే సంప్ర‌దాయాన్ని సృష్టించ‌వ‌ద్ద‌ని, ఇది ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌ని వ్యాఖ్యానించారు.

వ‌చ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయ‌ని, ఈ స‌భ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అయ్య‌న్న పాత్రుడు జ‌గ‌న్‌కు సూచించారు. త‌న సూచ‌న‌లు పాటించాల‌ని అన్నారు.

గ‌తంలో మాదిరిగా స‌భ‌ల‌కు రాకుండా ప్ర‌శ్న‌లు అడిగే సంస్కృతికి ఈ ద‌ఫా చెక్ పెడుతున్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు తేల్చిచెప్పారు. గ‌త ఏడాది కాలంలో స‌భ‌కు రాని వైసీపీ ఎమ్మెల్యేలు లిఖిత పూర్వ‌కంగా ప్ర‌శ్న‌లు అడిగారు. దీనికి స‌భ‌లో స‌మాధానాలు కూడా చెప్పారు. కానీ స‌భా సంప్ర‌దాయాల ప్ర‌కారం స‌భ‌కు రాని వారు అడిగే ప్ర‌శ్న‌ల‌ను ఇక‌పై అనుమ‌తించేది లేద‌ని తెలిపారు. కాబ‌ట్టి స‌భ‌కు వ‌చ్చి హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని అయ్య‌న్న సూచించారు. ఏ ప్ర‌శ్న అడిగినా ప్ర‌భుత్వ ప‌క్షం స‌మాధానం చెబుతుంద‌ని, తాను కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక వ‌చ్చే నెల‌లో తిరుప‌తిలో మ‌హిళా పార్ల‌మెంటును నిర్వ‌హిస్తున్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు పేర్కొన్నారు. 14, 15 తేదీల్లో తిరుప‌తి వేదిక‌గా ఈ స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌న్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీల‌లోని మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఆహ్వానాలు పంపుతున్నామ‌న్నారు. ఆయా రాష్ట్రాల‌కు చెందిన సుమారు 300 మందికిపైగా మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రు కానున్న‌ట్టు తెలిపారు.

త‌ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న చ‌ట్టాలు, స‌భా సంప్ర‌దాయాలు పంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, మ‌రింత మెరుగ్గా స‌భ‌ల‌ను న‌డిపించేందుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అయ్య‌న్న వివ‌రించారు.

ఈ స‌ద‌స్సుకు వైసీపీకి చెందిన మ‌హిళా ఎమ్మెల్యేల‌ను కూడా ఆహ్వానిస్తున్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు తెలిపారు. అంద‌రూ రావాల‌ని కోరిన‌ట్టు చెప్పారు. రాజ‌కీయాలు వేరేగా చేసుకోవాల‌ని, స‌భా సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు తెలుసుకుంటే భ‌విష్య‌త్తులో ఉత్త‌మ ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎదగ‌వ‌చ్చ‌ని, ప‌దిమందికి ఆద‌ర్శంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

గ‌తంలో 2014-19 మ‌ధ్య స్పీక‌ర్‌గా వ్య‌వ‌హరించిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా మ‌హిళా పార్ల‌మెంటును నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మానికి కూట‌మి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్ట‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 31, 2025 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago