Political News

జ‌గ‌న్ పాలిటిక్స్‌.. అయితే ఏంటి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాలిటిక్స్ భిన్నంగా ఉన్నాయి. ఆయ‌న ఏం జ‌రిగినా భిన్నంగా ఆలోచ‌న చేస్తారు. ఏ విష‌యాన్ని కూడా ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోరు. ఇది మంచిది కాదు. కొంప‌తీసి రాసేస్తారా ఏంటి? రాయ‌మాకండి! అని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తాజాగా మీడియా ముందు చేసిన వ్యాఖ్య‌లు. నిజ‌మే! జ‌గ‌న్ పాలిటిక్స్ అంతే అని మిగిలిన నాయ‌కుల మాట కూడా. ఆది నుంచి ఏం జ‌రిగినా ఆయ‌న మౌనంగా ఉంటారు.

కానీ నిజం తెలిసేలోగా అబ‌ద్ధం ప్ర‌పంచాన్ని చుట్టేస్తుంది. అది రాజ‌కీయాల్లో అయితే మ‌రింత ఎక్కువ‌గా జ‌రుగుతుంది. ఈ విష‌యంపైనే ఇప్పుడు వైసీపీలో ల‌డాయి జ‌రుగుతోంది. జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌ని నాయ‌కులు పెరుగుతున్నారు. వీరిలో సీనియ‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసేందుకూ సిద్ధంగా ఉన్నారన్న చ‌ర్చ సాగుతోంది. ఈ విష‌యాన్నే మీడియా మిత్రులు బొత్స ముందు ప్ర‌స్తావించిన‌ప్పుడు, “మా నాయ‌కుడు అంతే!” అని సెల‌విచ్చారు.

నిజానికి రాజ‌కీయాల్లో స‌రైన స‌మ‌యం అంటూ ఏదీ ఉండ‌దు. ప్ర‌త్య‌ర్థులు ఎప్పుడు నోళ్లు విప్పితే అప్పుడే స‌మాధానం చెప్ప‌డం స‌రైన స‌మ‌యం. కానీ జ‌గ‌న్ మాత్రం ముహూర్తాలు చూసుకుంటున్నారన్నది నాయ‌కులు చెబుతున్న మాట. దీంతో కొంద‌రు తమకే యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు. మ‌రికొంద‌రు “మనకెందుకులే” అని మౌనంగా ఉన్నారు. ఇంకొంద‌రు రెండు ప‌క్క‌ల రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు.

ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పెరిగితే వైసీపీకి న‌ష్టం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీ త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌ని, ప్రజ‌లు త‌మ‌కే అనుకూలంగా ఉంటార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న మౌనంగా ఉంటున్నారు. దీనిని సీమాంధ్ర‌కు చెందిన చాలామంది నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ ప‌రిణామాలే పార్టీలో చిచ్చుకు కార‌ణంగా మారుతున్నాయి. జ‌గ‌న్ మౌనం, ఆయ‌న ఉదాసీన‌త‌ను చాలా మంది త‌ట్టుకోలేక‌పోతున్నారు. బ‌ల‌మైన గ‌ళం కోసం ఎదురు చూస్తున్నారు.

చిత్రం ఏంటంటే.. బొత్స త్వ‌ర‌లోనే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ‌కు ఇదే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

Satya

Recent Posts

విద్యాశాఖ‌ విజేత‌… నారా లోకేష్‌!

విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…

23 minutes ago

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత…

1 hour ago

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…

2 hours ago

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

7 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

10 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

12 hours ago