కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెట్ మహమ్మద్ అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఆయన మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఇక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్పై అజారుద్దీన్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
రెండు నెలల క్రితం కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానంతో చర్చించానని, ఈ టికెట్ తనకే కేటాయిస్తారన్న నమ్మకం ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ విజయం దక్కించుకుంటానని కూడా అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ కూడా ఈ టికెట్ను అజారుద్దీన్కే ఇవ్వడం మంచిదని భావించారు. మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదుకాబట్టి ఇలా అయినా అవకాశం ఇవ్వాలని అనుకున్నారు.
కానీ గత నెల రోజులుగా అనూహ్యంగా పరిణామాలు మారుతున్నాయి. అజారుద్దీన్ స్థానంపై అనేక మలుపులు తిరుగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులతో తరచుగా భేటీ నిర్వహిస్తూ “జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి పార్టీ నాయకుడిని గెలిపించాలి” అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీనిబట్టి అప్పట్లోనే అజారుద్దీన్ వ్యవహారం డోలాయమానంలో పడింది. అయినప్పటికీ అజారుద్దీన్ మాత్రం తన పనితాను చేసుకుంటూ పోతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ తనదేనని, తన గెలుపు ఖాయం అని చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర కేబినెట్లో ఆయనను మండలికి పంపించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపాదించడం, మంత్రులు కూడా ఆమోదం తెలపడం రెండూ జరిగాయి. ఫలితంగా జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ చేజారిపోయింది. ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. ఏదేమైనా మండలికి పంపుతున్నందువల్ల అజారుద్దీన్ హ్యాపీగా ఫీల్ అవుతారో లేక జూబ్లీహిల్స్ టికెట్ కావాలని పట్టుబడతారో చూడాలి.
This post was last modified on August 30, 2025 6:09 pm
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…