వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న విషయం కూటమి ప్రభుత్వానికి కొరుకుడు పడడం లేదు. ప్రభుత్వం మారి 15 మాసాలు అయినప్పటికీ.. ఇప్పటికీ ఈ విషయం బ్రహ్మపదార్థంగానే మారిపోయింది. అలాగని వదలేస్తే.. ఈ నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించిన సమయంలో ఇక్కడ సీలింగ్ పెచ్చులు ఊడిన పరిస్థితి కనిపించింది.
అదేవిధంగా గోడలు కూడా చెమ్మెక్కాయి. గదుల్లో బూజు పట్టింది. ఇలా.. నిర్మాణం దెబ్బతింటోంది. ఈ క్రమంలో దీనిని తక్షణం ఏదో ఒక విధంగా వినియోగించుకోక తప్పదని నిర్ణయానికి వచ్చిన కూటమి సర్కారు.. తాజాగా.. ఈ విషయంపై అధ్యయనం చేయాలని భావించింది. ఈ క్రమంలో రుషికొండ ప్యాలెస్ను ఏవిధంగా వినియోగంలోకి తెచ్చుకోవాలన్న విషయంపై పరిశీలన చేసేందుకు.. మేధావులతో చర్చించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ.. ఈ ప్యాలెస్లో పర్యటించి.. నిర్మాణాలను పరిశీలించి.. సరైన విధంగా వినియోగించే మార్గాలపై పరిశీలించనుంది. అదేవిధంగా సిఫార్సులు చేయనుంది. ఈ మంత్రుల బృండంలో జనసేన నుంచి కందుల దుర్గేష్, టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. వీరితో పాటు.. విశాఖకు చెందిన పలువురుఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉండనున్నారు. ఈ మంత్రుల కమిటీనే స్థానిక నేతలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఏం చేస్తారు?
మంత్రుల కమిటీ.. మూడు రూపాల్లో ఈ ప్యాలెస్ను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అధ్యయనం చేయనుంది. అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దీనికి సమయం అంటూ ఏమీ లేదు. రెండు మాసాలు.. మూడు మాసాలు ఎంతైనా సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా దీనిని 1) ప్రైవేటుకు అప్పగించాలా? 2) పర్యాటక కట్టడంగా గుర్తించి ప్రజలకు ప్రవేశం కల్పించాలా? 3) రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకోవాలా? అనే విషయాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిలో మేధావులు, స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
This post was last modified on August 30, 2025 1:40 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…