వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై మరో వ్యూహంతో ముందుకు సాగాలని టీడీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు కూడా ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. వైసీపీ తరఫున ఈ రెండు చోట్ల పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ పెను దెబ్బ నుంచి వైసీపీ ఇంకా కోలుకోక ముందే మరో పెద్ద వ్యూహంతో వైసీపీకి షాకిచ్చేందుకు టీడీపీ రెడీ అయింది.
విషయం ఏంటి..
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి సమయం ప్రకారం నిర్వహించినా నిర్వహించకపోయినా ఇబ్బంది లేదు. ప్రత్యేక అధికారులను నియమించి కొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఆర్టీసీ ఉచిత బస్సు వంటివి మహిళల్లోను, సాధారణ ప్రజల్లోను మంచి పేరు వచ్చిన నేపథ్యంలో సమయానికే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రెడీ చేయాలని ఇటీవల చంద్రబాబు సూచన ప్రాయంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. అయితే ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ జగన్ సహా ఆ పార్టీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వేయాలన్నది ఆలోచన. “ఎక్కడైతే గత మునిసిపల్ ఎన్నికల్లో మన జెండా కూడా పట్టుకోకుండాఅడ్డుకున్నారో అక్కడ ఇప్పుడు మన జెండానే ఎగరాలి” అన్న సంకల్పంతో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ప్రదానంగా పుంగనూరు, పులివెందుల, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అనకాపల్లి తదితర కీలక మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలపై యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటోంది.
పులివెందులపై ఫోకస్
ఇవన్నీ ఒక ఎత్తయితే పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మునిసిపాలిటీ ఇప్పుడు టీడీపీకి మరింత కీలకంగా మారింది. రెండు జెడ్పీ ఉప ఎన్నికల్లో విజయం దరిమిలా ఆ పట్టును నిలబెట్టుకోవడంతోపాటు వైసీపీని మరింత ఇరుకున పెట్టేందుకు పులివెందులలో పాగా వేయాలని నిర్ణయించింది.
దీనికి గాను నేరుగా యువనేత, మంత్రి నారా లోకేషే రంగంలోకి దిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ తానై వ్యవహరించేందుకు స్థానిక నాయకులకు గట్టి హామీ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమేరకు అలెర్ట్ అవుతారన్నది చూడాలి.
This post was last modified on September 7, 2025 2:15 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…