Political News

ట్రంప్ టారిఫ్ దెబ్బకు.. మోడీ ‘సొంత’ వైద్యం!

భారత దేశంపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 25 శాతం మేరకు సుంకాలు విధించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న నెపంతో భారత్‌పై మరో 25 శాతం మేరకు సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా అంతర్గత భద్రతా విభాగం సమాచారం కూడా ఇచ్చింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్‌పై విధించిన సుంకాలే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం సుంకాల శాతం 50 శాతానికి పెరిగింది.

సుంకాల పెంపుతో అమెరికాకు భారత్‌ నుంచి జరిగే సుమారు 5 లక్షల 25 వేల కోట్ల రూపాయల ఎగుమతులపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉన్న మొబైల్‌ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఔషధాలు మినహా, మిగతా అన్ని రంగాలకు చెందిన ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పడనుంది. వీటిలో వస్త్ర పరిశ్రమ, దుస్తులు, రత్నాలు, బంగారం, ఆభరణాలు, రొయ్యలు, చెప్పులు, ఆట బొమ్మలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్‌ యంత్రాలు వంటివి ఉన్నాయి.

అయితే అమెరికా సుంకాలు విధించినప్పటికీ కొన్ని వస్తువులపై వాటికి మినహాయింపు ఉంది. ఈ జాబితాలో ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి. ఇక అమెరికా విధిస్తున్న సుంకాల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘సొంత’ వైద్యానికి సిద్ధమైంది. మేడ్‌ ఇన్ ఇండియా (స్వదేశీ) ఉత్పత్తులకు ఊతం ఇవ్వడం ద్వారా భారత్ దీనిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నారు.

దేశీయ మార్కెట్లను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘స్వదేశీ ఉత్పత్తుల’ అవసరాన్ని నొక్కి చెప్పారు. స్వదేశీ, మేక్‌ ఇన్ ఇండియా అనేవి దోహదపడతాయని అంటున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్పత్తి మాత్రం మనదేశంలోనే జరగాలని స్పష్టం చేస్తూ, స్వదేశీ అనేది ప్రతి ఒక్కరి జీవిత మంత్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు రష్యా సహా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా అమెరికా విధించిన సుంకాల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మరి ఈ సొంత మంత్రం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

This post was last modified on August 27, 2025 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

1 minute ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago