Political News

ట్రంప్ టారిఫ్ దెబ్బకు.. మోడీ ‘సొంత’ వైద్యం!

భారత దేశంపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 25 శాతం మేరకు సుంకాలు విధించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న నెపంతో భారత్‌పై మరో 25 శాతం మేరకు సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా అంతర్గత భద్రతా విభాగం సమాచారం కూడా ఇచ్చింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్‌పై విధించిన సుంకాలే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం సుంకాల శాతం 50 శాతానికి పెరిగింది.

సుంకాల పెంపుతో అమెరికాకు భారత్‌ నుంచి జరిగే సుమారు 5 లక్షల 25 వేల కోట్ల రూపాయల ఎగుమతులపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉన్న మొబైల్‌ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఔషధాలు మినహా, మిగతా అన్ని రంగాలకు చెందిన ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పడనుంది. వీటిలో వస్త్ర పరిశ్రమ, దుస్తులు, రత్నాలు, బంగారం, ఆభరణాలు, రొయ్యలు, చెప్పులు, ఆట బొమ్మలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్‌ యంత్రాలు వంటివి ఉన్నాయి.

అయితే అమెరికా సుంకాలు విధించినప్పటికీ కొన్ని వస్తువులపై వాటికి మినహాయింపు ఉంది. ఈ జాబితాలో ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి. ఇక అమెరికా విధిస్తున్న సుంకాల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘సొంత’ వైద్యానికి సిద్ధమైంది. మేడ్‌ ఇన్ ఇండియా (స్వదేశీ) ఉత్పత్తులకు ఊతం ఇవ్వడం ద్వారా భారత్ దీనిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నారు.

దేశీయ మార్కెట్లను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘స్వదేశీ ఉత్పత్తుల’ అవసరాన్ని నొక్కి చెప్పారు. స్వదేశీ, మేక్‌ ఇన్ ఇండియా అనేవి దోహదపడతాయని అంటున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్పత్తి మాత్రం మనదేశంలోనే జరగాలని స్పష్టం చేస్తూ, స్వదేశీ అనేది ప్రతి ఒక్కరి జీవిత మంత్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు రష్యా సహా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా అమెరికా విధించిన సుంకాల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మరి ఈ సొంత మంత్రం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

6 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

6 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

6 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

7 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

8 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

9 hours ago