Political News

జనసేనలో స్థాయి ఏదైనా కట్టు దాటితే వేటే!

జనసేన… తెలుగు నేలలోని దాదాపుగా అన్ని పార్టీల కంటే కూడా చిన్న వయసు కలిగిన పార్టీగానే చెప్పాలి. అయినా కూడా పార్టీ నియావళిని పకడ్బందీగా అమలు చేసే విషయంలో అధిష్ఠానం ఓ స్పష్టమైన గీత గీసుకున్నట్టుంది. పార్టీ నియమావళి దాటిన వారు పెద్ద వారైనా, చిన్నవారైనా… అసలు పార్టీలో వారి స్థాయి ఏదైనా కూడా సస్పెన్షన్ వేసేయాల్సిందేనని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది కట్టుదాటిన నేతలను సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం… తాజాగా సోమవారం వివాదం రేపిన మచిలీపట్నం పరిధిలోని పార్టీ క్రియాశీల కార్యకర్త కర్రి మహేశ్ ను పార్టీ సస్పెండ్ చేసింది.

కర్రి మహేశ్ ఏం చేశారన్న విషయానికి వస్తే..మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన ఆదివారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ ను అడ్డగించారు. అంతటితో ఆగకుండా ఆ హోంగార్డ్ పై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సోమవారం ఉదయానికంతా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన వెంటనే మచిలీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బండి రామకృష్ణ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎవరైతే ఏమిటీ.. పార్టీ లైన్ దాటితే వేటే అని పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో కర్రి మహేశ్ పై రామకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కర్రి మహేశ్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపనే లేదని చెప్పారు. అయితే వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, హోంగార్డ్ చెబుతున్న వివరాలను ఆధారంగా చేసుకుని మహేశ్ పై చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయినా పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అసలు ఇష్టం ఉండదన్నారు. ఈ కారణంగానే తిరుపతి, రాజమహేంద్రవరం ఘటనల్లో పార్టీ నేతలపై పవన్ వేగంగా చర్యలకు ఆదేశించారని, వారిని ఏకంగా సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ తరహా చర్యలు రాజకీయాల్లో సచ్ఛీలతకు మార్గంగా నిలుస్తాయని ఆయన చెప్పారు.

This post was last modified on August 26, 2025 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago