Political News

జనసేనలో స్థాయి ఏదైనా కట్టు దాటితే వేటే!

జనసేన… తెలుగు నేలలోని దాదాపుగా అన్ని పార్టీల కంటే కూడా చిన్న వయసు కలిగిన పార్టీగానే చెప్పాలి. అయినా కూడా పార్టీ నియావళిని పకడ్బందీగా అమలు చేసే విషయంలో అధిష్ఠానం ఓ స్పష్టమైన గీత గీసుకున్నట్టుంది. పార్టీ నియమావళి దాటిన వారు పెద్ద వారైనా, చిన్నవారైనా… అసలు పార్టీలో వారి స్థాయి ఏదైనా కూడా సస్పెన్షన్ వేసేయాల్సిందేనని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది కట్టుదాటిన నేతలను సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం… తాజాగా సోమవారం వివాదం రేపిన మచిలీపట్నం పరిధిలోని పార్టీ క్రియాశీల కార్యకర్త కర్రి మహేశ్ ను పార్టీ సస్పెండ్ చేసింది.

కర్రి మహేశ్ ఏం చేశారన్న విషయానికి వస్తే..మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన ఆదివారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ ను అడ్డగించారు. అంతటితో ఆగకుండా ఆ హోంగార్డ్ పై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సోమవారం ఉదయానికంతా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన వెంటనే మచిలీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బండి రామకృష్ణ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎవరైతే ఏమిటీ.. పార్టీ లైన్ దాటితే వేటే అని పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో కర్రి మహేశ్ పై రామకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కర్రి మహేశ్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపనే లేదని చెప్పారు. అయితే వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, హోంగార్డ్ చెబుతున్న వివరాలను ఆధారంగా చేసుకుని మహేశ్ పై చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయినా పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అసలు ఇష్టం ఉండదన్నారు. ఈ కారణంగానే తిరుపతి, రాజమహేంద్రవరం ఘటనల్లో పార్టీ నేతలపై పవన్ వేగంగా చర్యలకు ఆదేశించారని, వారిని ఏకంగా సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ తరహా చర్యలు రాజకీయాల్లో సచ్ఛీలతకు మార్గంగా నిలుస్తాయని ఆయన చెప్పారు.

This post was last modified on August 26, 2025 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

7 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

44 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago