రాజకీయాల్లో ఉన్న వారు తామున్న పరిస్థితిని మరిచిపోయి ఎదుటివారి పరిస్థితిని ఎద్దేవా చేయడం కామనే. తమ వరకు వస్తే అప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలో తాము ఎన్డీయేకు మద్దతు ఇస్తామని వైసీపీ ప్రకటించింది. ఇది తప్పుకాకపోవచ్చు. తమ పార్టీ తీసుకునే నిర్ణయం కావొచ్చు.
కానీ ఈ సమయంలో గతం గుర్తు చేస్తున్నారు మేధావులు. కేంద్రంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇచ్చే సమయంలో మన రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అదే మేమైతే మాకు ఒక్క అవకాశం వస్తే కేంద్రాన్ని నిలేసి రాష్ట్రానికి మేళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పోలవరం నిధులు ఇస్తే తప్ప మేం మద్దతు ఇవ్వబోం అని గత ఆరేడేళ్లుగా జగన్ పాడిందే పాట పాడుతున్నారు. అంతేకాదు గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా ఈమాటే చెప్పారు.
జనసేన, బీజేపీ, టీడీపీ కలయికను తప్పుబట్టిన జగన్ రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు తీసుకువస్తున్నారో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. కట్ చేస్తే ఏడాదిన్నర తిరగకుండానే ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఎన్డీయే ఏకగ్రీవంగా నిలబెట్టిన సీపీ రాధాకృష్ణన్కు వైసీపీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. తమకు రాజ్యసభలో ఉన్న 9 మంది, లోక్సభలో ఉన్న ముగ్గురు కూడా రాధాకృష్ణన్కే ఓటేస్తారని తేల్చిచెప్పింది.
మరి ఇప్పుడు జగన్ ఏం డిమాండ్ చేసి ఈ మద్దతు ప్రకటించారన్నది ప్రశ్న. ఆయన గతం నుంచి గగ్గోలు పెడుతున్నట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించామని చెప్పగలరా? ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని బలపరుస్తున్నామని అనగలరా? లేక సొంత జిల్లా కడపలో విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన ఉక్కు పరిశ్రమ కోసం ఎన్డీయే వెనక ఉన్నామని అనగలరా?
అంటే ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి. తన వరకు వస్తే ఎలాగైనా రాజకీయాలు చేయొచ్చు కానీ ఎదుటి వారి విషయంలో మాత్రం ఎలాగైనా విమర్శలు చేయొచ్చన్న వాదన జగన్ నుంచే నేర్చుకోవాలేమో అంటున్నారు మేధావులు.
This post was last modified on August 23, 2025 6:37 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…