Political News

విగ్రహాల జోలికొస్తే తాట తీస్తా: చంద్రబాబు

రాష్ట్రంలో రాజకీయ నేతల విగ్రహాలను కూలదోయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పార్టీల పరంగా విమర్శలు చేయాలి కానీ దివంగత నేతల విగ్రహాల విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? అని విపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా శనివారం ఉదయం కృష్ణాజిల్లాలోని కైకలూరులో ఇటీవలి ఏర్పాటు చేసిన కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని కొందరు దుండగులు కూలదోశారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు నిందితులను 24 గంటల్లోగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. ఏ పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టరాదని కూడా ఆదేశించారు. నేతలు ఏం చేశారు? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. నేతల విగ్రహాలు ఏవైనా అవమానించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం చంద్రబాబు కాకినాడ పర్యటనకు వెళ్లారు.

ప్రతి నెలా చివరి శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో చంద్రబాబు పర్యటించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపిక చేసిన ప్రాంతంలో చీపురు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

చెత్త నుంచి సంపద సృష్టించవచ్చన్న తన వాదనను కేంద్రం ఇటీవలి కాలంలో నిరూపించిందన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించిన ఓ ప్రాజెక్టుకు చెత్తను వినియోగించారని ఆయన తెలిపారు. సుమారు వెయ్యి టన్నుల చెత్తను బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా రాజధాని ఢిల్లీలో చెత్త సమస్యను తగ్గించారని చెప్పారు. అదే విధానాన్ని ఏపీ ఎప్పుడో ప్రారంభించిందని, అయితే ప్రభుత్వం మారడంతో అన్ని అస్తవ్యస్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రతి నగరంలోనూ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను ప్రోత్సహించనున్నట్టు తెలిపారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

6 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

39 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

47 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago