ఇదేదో సినిమా డైలాగు కాదు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు, సీనియర్ నేత కిళత్తూరు నారాయణ స్వామి చెప్పిన మాట. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు 48 మందిపై కేసు నమోదు చేశారు. 13 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ పరంపరలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి పాత్ర కూడా ఈ కుంభకోణంలో ఉంటుందని అధికారులు సందేహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయనకు కూడా గత నెలలో నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. తాజాగా శుక్రవారం ఉదయం సిట్ అధికారులు ముగ్గురు నేరుగా చిత్తూరులోని ఆయన ఇంటికే వెళ్లారు. పలు పత్రాల కోసం ఆయన ఇంట్లో తనిఖీ చేశారు. తనిఖీకి మాజీ మంత్రి సంపూర్ణంగా సహకరించినట్టు తెలిసింది.
రండి సర్, రండి అంటూ ఎలాంటి బెరుకూ లేకుండా అధికారులను పిలిచి టీ, కాఫీలు బయట నుంచి తెప్పించి మర్యాదలు చేశారు. అనంతరం ఆయనే స్వయంగా బెడ్ రూం సహా బీరువాల తాళాలు ఇచ్చి దగ్గరుండి వారు తనిఖీలు చేసుకునేందుకు సహకరించారు.
అయితే తమకు కావాల్సిన పత్రాలు లభించకపోవడంతో మరోసారి నారాయణ స్వామికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈసారి తప్పక విచారణకు వస్తానని ఆయన చెప్పడంతో వెనుదిరిగారు.
తనిఖీలు చేస్తున్న సమయంలో నారాయణ స్వామి బేల పలుకులు పలికినట్టు తెలిసింది.
అయ్యా, నాకు అక్షరం ముక్కరాదు. అంతా మా సారే చూసుకున్నారు. ఆయనే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఏం చెబితే అది చేశా. అది అక్రమమో సక్రమమో నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారు, మీకెలా సహకరిస్తున్నానో అప్పట్లో ప్రభుత్వంలో మంత్రిగా మా బాస్ చెప్పినట్టు చేశా. మీరు రమ్మంటున్నారు కాబట్టి మళ్లీ సారి విచారణకు వస్తా అని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.
This post was last modified on August 23, 2025 3:31 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…