Political News

కాపు సామాజిక వర్గాన్ని ఖుషీ చేసిన చంద్రబాబు..

సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయాలు జోరందుకున్న ఏపీలో పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఆయా వర్గాలను సంతృప్తి పరిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రంలో తాజాగా సీఎం చంద్రబాబు చేసిన కీలక నిర్ణయం కాపు సామాజిక వర్గాన్ని మరింత ఖుషీ చేసింది. అయితే దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. నిర్ణయాన్ని నిర్ణయంగానే చూడాలని, సామాజిక వర్గంతో ముడిపెట్టడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజకీయాలు, ప్రభుత్వాల నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా దాదాపు ఇలానే ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల వాదనగా ఉంది.

ఏం జరిగింది?

తెలుగు అధికార భాషా సంఘానికి ఇప్పటి వరకు ఏపీలో ఎవరి పేరూ లేదు. గతంలో వైసీపీ హయాంలో ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రతిపాదన తెరమీదకు వచ్చినా అప్పటి సీఎం జగన్ పెడచెవిన పెట్టారు. ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేసిన దరిమిలా అధికార భాషా సంఘానికి అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవ‌ల ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు భాషా ప్రేమికుడు మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ క్రంలో తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో తెలుగు అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరును ప్రతిపాదించగా మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. మండలి కుమారుడు బుద్ధ ప్రసాద్ ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీలోనూ, అంతకుముందు కాంగ్రెస్‌లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకట కృష్ణారావు పేరును పెట్టడం పట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది.

“ఇన్నాళ్లకు మండలికి మంచి గుర్తింపు వచ్చింది” అని పలువురు వ్యాఖ్యానించడంతో పాటు మండలి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ నిర్ణయంగానే చూడాలని పేర్కొన్నారు. తటస్థులు కూడా దీనిని మంచి నిర్ణయంగానే పేర్కొనడం విశేషం. ఏదేమైనా మండలికి తగిన గుర్తింపు లభించిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

44 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago