చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల్లో ఒకరి వ్యవహారం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మంత్రిగా మంచి మార్కులు వేసుకుంటున్నారని ఇటు పార్టీ వర్గాల్లోను, అటు సీఎం స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది.
వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సంజీవరెడ్డి గారి సవిత ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వీరిలో వయసు పరంగా చూసుకుంటే సంజీవరెడ్డి గారి సవిత కొంచెం ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఆమె నిరంతరం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మమేకం కావడం, ప్రభుత్వపరంగా చేస్తున్న కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం, యాక్టివ్గా ఉండడం వంటి పరిణామాలు చంద్రబాబును ఆకట్టుకున్నాయి.
అందుకే ఆమెను మంచి మంత్రి అంటూ ఇటీవల ప్రశంసించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సవితకు సంబంధించిన పనితీరుకు చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేస్తున్నారని, యాక్టివ్గా పాల్గొంటున్నారని ఆమెకు కితాబిచ్చారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలు తర్వాత సవిత అటు నియోజకవర్గంలోనూ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. రైతులతోనూ, మహిళలతోనూ మమేకం అవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, గత వైసీపీ ప్రభుత్వం మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
మహానాడు సమయంలో ఆమె సైకిల్ తొక్కారు. దాదాపు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సైకిల్ యాత్ర ద్వారా పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు. మహానాడు విజయానికి దోహదపడ్డారు. తాజాగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నేరుగా ఆమె ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.
దాంతో సీఎం చంద్రబాబు ఆమె కృషి పట్ల, ఆమె అంకితభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి ఆమెను ప్రశంసించడం విశేషం. వయసుతో సంబంధం లేకుండా ప్రజల్లో మమేకమవుతున్నారని, మంచి మంత్రి అని మంత్రి సవితను చంద్రబాబు ప్రశంసించారు.
నిజానికి పార్టీ పరంగా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రికి ఇబ్బందులు ఎదురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాటితో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోవడం, సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం, పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించడం ద్వారా సవిత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇదే ఆమెకు మంచి మార్కులు పడేలా, మంచి పేరు తెచ్చేలా చేసిందన్నది వాస్తవం అంటున్నారు నాయకులు.
This post was last modified on August 20, 2025 12:55 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…