Political News

ప‌వ‌ర్‌లో లేక‌పోయినా.. అక్క‌డ ఆయ‌నే ‘ప‌వ‌ర్‌’.. !

ప్ర‌స్తుతం వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేదు. ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ పెద్ద‌గా పుంజుకుంటున్న దాఖలాలు కూడా క‌నిపించ‌డం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేత‌లే… ప‌వ‌ర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారుల‌ను ఆడిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్క‌డ తిరుప‌తి నియోజ‌కవ‌ర్గంలో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్క‌డి అధికారులు మాత్రం.. వైసీపీ కీల‌క నేత క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఆయ‌న‌కు ఉన్న ప‌రిచ‌యాలు, గ‌తంలో స‌ద‌రు ఉన్న‌తాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూట‌మి ప్ర‌భు త్వం ఇస్తున్న ఆదేశాల‌ను కూడా ఖాత‌రు చేయ‌ని స్థాయిలో అధికారులు వైసీపీ నాయ‌కుడు చెప్పిన‌ట్టు న‌డుచుకునేలా చేస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి వైసీపీ హ‌యాంలో నియ‌మితులై న అధికారుల‌ను రాష్ట్రంలో చాలా కీల‌క శాఖ‌ల నుంచి త‌ప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ ప‌నికావ డం లేద‌ని.. దీనికి స‌ద‌రు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడి నుంచి ఒత్తిడులు వ‌స్తున్నాయ‌ని స‌మాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌ధానంగా బ‌దిలీల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అధికారిని కూడా క‌దిలించ‌లేక పోయార‌న్న టాక్ కూట‌మి నాయ‌కుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చూస్తున్న శాఖే కావ‌డం.. ప‌వన్‌కు, స‌ద‌రు వైసీపీ నాయ‌కుడికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వైరం ఉన్నప్ప‌టికీ.. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు ఎవ‌రూ న‌డుచుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. జిల్లాలో అట‌వీ భాగం ఎక్కువ‌. అదేస‌మ‌యంలో ఎర్ర‌చంద‌నానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గ‌తంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా ప్ర‌భుత్వానికి ఇబ్బందులు కూడా త‌లెత్తుతున్నాయి.

దీనిని గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క అధికారుల‌ను మార్చాల‌ని నిర్ణ‌యించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఆయ‌న చెప్పిన‌ట్టు జ‌రిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్న‌త‌స్థాయి అధికారు లు ఫైళ్ల‌ను ప‌క్క‌న పెట్టారు. దీనికి కార‌ణం.. వైసీపీ సీనియ‌ర్ నేత హ‌వానేన‌ని కూట‌మి నాయ‌కులు అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. స‌ద‌రు నేత క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్‌ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వెనుక‌.. ప‌వ‌ర్ లో లేక‌పోయినా.. ప‌వ‌ర్ కేంద్రంగా మారిన స‌ద‌రు నేతేన‌ని తెలుస్తోంది.

This post was last modified on August 16, 2025 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…

32 minutes ago

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…

3 hours ago

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు... రావు. ఎన్నిక‌ల…

4 hours ago

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

7 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

8 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

9 hours ago