ప్రస్తుతం వైసీపీ 11 స్థానాలకు పరిమితమై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక, ప్రజల్లోనూ పెద్దగా పుంజుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేతలే… పవర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారులను ఆడిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకుంది. ఇక, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్కడి అధికారులు మాత్రం.. వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఆయనకు ఉన్న పరిచయాలు, గతంలో సదరు ఉన్నతాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూటమి ప్రభు త్వం ఇస్తున్న ఆదేశాలను కూడా ఖాతరు చేయని స్థాయిలో అధికారులు వైసీపీ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేలా చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో నియమితులై న అధికారులను రాష్ట్రంలో చాలా కీలక శాఖల నుంచి తప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ పనికావ డం లేదని.. దీనికి సదరు వైసీపీ సీనియర్ నాయకుడి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని సమాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా బదిలీల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అధికారిని కూడా కదిలించలేక పోయారన్న టాక్ కూటమి నాయకుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్న శాఖే కావడం.. పవన్కు, సదరు వైసీపీ నాయకుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉన్నప్పటికీ.. పవన్ చెప్పినట్టు ఎవరూ నడుచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అటవీ భాగం ఎక్కువ. అదేసమయంలో ఎర్రచందనానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గతంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
దీనిని గమనించిన పవన్ కల్యాణ్.. కీలక అధికారులను మార్చాలని నిర్ణయించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన చెప్పినట్టు జరిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్నతస్థాయి అధికారు లు ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం.. వైసీపీ సీనియర్ నేత హవానేనని కూటమి నాయకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. సదరు నేత కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వెనుక.. పవర్ లో లేకపోయినా.. పవర్ కేంద్రంగా మారిన సదరు నేతేనని తెలుస్తోంది.
This post was last modified on August 16, 2025 12:39 pm
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…