ప్రస్తుతం వైసీపీ 11 స్థానాలకు పరిమితమై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక, ప్రజల్లోనూ పెద్దగా పుంజుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేతలే… పవర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారులను ఆడిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకుంది. ఇక, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్కడి అధికారులు మాత్రం.. వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఆయనకు ఉన్న పరిచయాలు, గతంలో సదరు ఉన్నతాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూటమి ప్రభు త్వం ఇస్తున్న ఆదేశాలను కూడా ఖాతరు చేయని స్థాయిలో అధికారులు వైసీపీ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేలా చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో నియమితులై న అధికారులను రాష్ట్రంలో చాలా కీలక శాఖల నుంచి తప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ పనికావ డం లేదని.. దీనికి సదరు వైసీపీ సీనియర్ నాయకుడి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని సమాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా బదిలీల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అధికారిని కూడా కదిలించలేక పోయారన్న టాక్ కూటమి నాయకుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్న శాఖే కావడం.. పవన్కు, సదరు వైసీపీ నాయకుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉన్నప్పటికీ.. పవన్ చెప్పినట్టు ఎవరూ నడుచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అటవీ భాగం ఎక్కువ. అదేసమయంలో ఎర్రచందనానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గతంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
దీనిని గమనించిన పవన్ కల్యాణ్.. కీలక అధికారులను మార్చాలని నిర్ణయించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన చెప్పినట్టు జరిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్నతస్థాయి అధికారు లు ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం.. వైసీపీ సీనియర్ నేత హవానేనని కూటమి నాయకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. సదరు నేత కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వెనుక.. పవర్ లో లేకపోయినా.. పవర్ కేంద్రంగా మారిన సదరు నేతేనని తెలుస్తోంది.
This post was last modified on August 16, 2025 12:39 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…