ప్రస్తుతం వైసీపీ 11 స్థానాలకు పరిమితమై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక, ప్రజల్లోనూ పెద్దగా పుంజుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేతలే… పవర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారులను ఆడిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకుంది. ఇక, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్కడి అధికారులు మాత్రం.. వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఆయనకు ఉన్న పరిచయాలు, గతంలో సదరు ఉన్నతాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూటమి ప్రభు త్వం ఇస్తున్న ఆదేశాలను కూడా ఖాతరు చేయని స్థాయిలో అధికారులు వైసీపీ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేలా చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో నియమితులై న అధికారులను రాష్ట్రంలో చాలా కీలక శాఖల నుంచి తప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ పనికావ డం లేదని.. దీనికి సదరు వైసీపీ సీనియర్ నాయకుడి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని సమాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా బదిలీల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అధికారిని కూడా కదిలించలేక పోయారన్న టాక్ కూటమి నాయకుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్న శాఖే కావడం.. పవన్కు, సదరు వైసీపీ నాయకుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉన్నప్పటికీ.. పవన్ చెప్పినట్టు ఎవరూ నడుచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అటవీ భాగం ఎక్కువ. అదేసమయంలో ఎర్రచందనానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గతంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
దీనిని గమనించిన పవన్ కల్యాణ్.. కీలక అధికారులను మార్చాలని నిర్ణయించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన చెప్పినట్టు జరిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్నతస్థాయి అధికారు లు ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం.. వైసీపీ సీనియర్ నేత హవానేనని కూటమి నాయకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. సదరు నేత కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వెనుక.. పవర్ లో లేకపోయినా.. పవర్ కేంద్రంగా మారిన సదరు నేతేనని తెలుస్తోంది.
This post was last modified on August 16, 2025 12:39 pm
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…