ప్రస్తుతం వైసీపీ 11 స్థానాలకు పరిమితమై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక, ప్రజల్లోనూ పెద్దగా పుంజుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేతలే… పవర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారులను ఆడిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకుంది. ఇక, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్కడి అధికారులు మాత్రం.. వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఆయనకు ఉన్న పరిచయాలు, గతంలో సదరు ఉన్నతాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూటమి ప్రభు త్వం ఇస్తున్న ఆదేశాలను కూడా ఖాతరు చేయని స్థాయిలో అధికారులు వైసీపీ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేలా చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో నియమితులై న అధికారులను రాష్ట్రంలో చాలా కీలక శాఖల నుంచి తప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ పనికావ డం లేదని.. దీనికి సదరు వైసీపీ సీనియర్ నాయకుడి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని సమాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా బదిలీల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అధికారిని కూడా కదిలించలేక పోయారన్న టాక్ కూటమి నాయకుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్న శాఖే కావడం.. పవన్కు, సదరు వైసీపీ నాయకుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉన్నప్పటికీ.. పవన్ చెప్పినట్టు ఎవరూ నడుచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అటవీ భాగం ఎక్కువ. అదేసమయంలో ఎర్రచందనానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గతంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
దీనిని గమనించిన పవన్ కల్యాణ్.. కీలక అధికారులను మార్చాలని నిర్ణయించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన చెప్పినట్టు జరిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్నతస్థాయి అధికారు లు ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం.. వైసీపీ సీనియర్ నేత హవానేనని కూటమి నాయకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. సదరు నేత కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వెనుక.. పవర్ లో లేకపోయినా.. పవర్ కేంద్రంగా మారిన సదరు నేతేనని తెలుస్తోంది.
This post was last modified on August 16, 2025 12:39 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…