Political News

ప‌వ‌ర్‌లో లేక‌పోయినా.. అక్క‌డ ఆయ‌నే ‘ప‌వ‌ర్‌’.. !

ప్ర‌స్తుతం వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేదు. ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ పెద్ద‌గా పుంజుకుంటున్న దాఖలాలు కూడా క‌నిపించ‌డం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేత‌లే… ప‌వ‌ర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారుల‌ను ఆడిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్క‌డ తిరుప‌తి నియోజ‌కవ‌ర్గంలో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్క‌డి అధికారులు మాత్రం.. వైసీపీ కీల‌క నేత క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఆయ‌న‌కు ఉన్న ప‌రిచ‌యాలు, గ‌తంలో స‌ద‌రు ఉన్న‌తాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూట‌మి ప్ర‌భు త్వం ఇస్తున్న ఆదేశాల‌ను కూడా ఖాత‌రు చేయ‌ని స్థాయిలో అధికారులు వైసీపీ నాయ‌కుడు చెప్పిన‌ట్టు న‌డుచుకునేలా చేస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి వైసీపీ హ‌యాంలో నియ‌మితులై న అధికారుల‌ను రాష్ట్రంలో చాలా కీల‌క శాఖ‌ల నుంచి త‌ప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ ప‌నికావ డం లేద‌ని.. దీనికి స‌ద‌రు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడి నుంచి ఒత్తిడులు వ‌స్తున్నాయ‌ని స‌మాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌ధానంగా బ‌దిలీల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అధికారిని కూడా క‌దిలించ‌లేక పోయార‌న్న టాక్ కూట‌మి నాయ‌కుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చూస్తున్న శాఖే కావ‌డం.. ప‌వన్‌కు, స‌ద‌రు వైసీపీ నాయ‌కుడికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వైరం ఉన్నప్ప‌టికీ.. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు ఎవ‌రూ న‌డుచుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. జిల్లాలో అట‌వీ భాగం ఎక్కువ‌. అదేస‌మ‌యంలో ఎర్ర‌చంద‌నానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గ‌తంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా ప్ర‌భుత్వానికి ఇబ్బందులు కూడా త‌లెత్తుతున్నాయి.

దీనిని గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క అధికారుల‌ను మార్చాల‌ని నిర్ణ‌యించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఆయ‌న చెప్పిన‌ట్టు జ‌రిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్న‌త‌స్థాయి అధికారు లు ఫైళ్ల‌ను ప‌క్క‌న పెట్టారు. దీనికి కార‌ణం.. వైసీపీ సీనియ‌ర్ నేత హ‌వానేన‌ని కూట‌మి నాయ‌కులు అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. స‌ద‌రు నేత క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్‌ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వెనుక‌.. ప‌వ‌ర్ లో లేక‌పోయినా.. ప‌వ‌ర్ కేంద్రంగా మారిన స‌ద‌రు నేతేన‌ని తెలుస్తోంది.

This post was last modified on August 16, 2025 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

55 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago