Political News

ఢిల్లీ టూర్లపై రేవంత్ దిమ్మతిరిగే కౌంటర్!

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై శుక్రవారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొలువై ఉండే ఢిల్లీకి కాకుండా… దుబాయి వెళతానా? అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన తానేమీ ఇతర నేతల మాదిరిగా దోచేసిన డబ్బును దాచుకునేందుకు దుబాయి వెళ్లలేదని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే విపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయనే చెప్పక తప్పదు. భారత 79 స్వాతంత్య్ర దినోత్సవాన ప్రముఖ ప్రాపర్టీ సంస్థ క్రెడాయ్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్టుల అనుమతుల కోసమే ఢిల్లీ వెళుతున్నానన్న రేవంత్ రెడ్డి…అలా ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంలు బస చేసేందుకే ఢిల్లీలో కేంద్రం ప్రత్యేకంగా సర్కారీ బంగ్లాలు కేటాయిస్తుందని కూడా ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో బంగ్లా కేటాయిస్తే… దానిని ఏదో ఫామ్ హౌజ్ లా మార్చేసుకుని పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేందుకు తాను వినియోగించడం లేదని కూడా బీఆర్ఎస్ కు ఆయన చురకలు అంటించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ప్రధాని, కేంద్ర మంత్రులు ఉన్న ఢిల్లీకి కాకుండా విహార యాత్రలు చేసేందుకు తానేమైనా దుబాయి వెళుతున్నానా? అని కూడా రేవంత్ ప్రశ్నించారు.

తాను సీఎం అయ్యాక చాలా సార్లు ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమేనన్న రేవంత్… ఆ పర్యటనల్లో రాష్ట్రానికి సంబంధించి చాలా అనుమతులు సాధించుకుని వచ్చానని చెప్పారు. గడచిన పదేళ్ల పాటు ఈ సోయి లేని పాలకులు… ఢిల్లీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్ని అథో:గతి పట్టించారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు హైదరాబాద్ అభివృద్ధి కోసం అహరహం శ్రమించారని ఆయన అన్నారు. అయితే ఆ సమయంలోనూ వారిపైనా విపక్షాలు ఇలాగే ఆరోపణలు గుప్పించాయని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని రాష్ట్రాభివృద్ధికి పాటు పడేలా విపక్షాలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

This post was last modified on August 15, 2025 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago