ఒక విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించాలి. వీళ్ళు ఏనాడూ బాలీవుడ్ వెంట పరుగులు పెట్టలేదు. అక్కడి దర్శక నిర్మాతలు చాలాసార్లు వచ్చి కలిసినా సరే సున్నితంగా తిరస్కరించారు తప్పించి తొందరపడిన దాఖలాలు పాతిక సంవత్సరాల్లో ఎప్పుడూ లేవు. ఇప్పుడీ టాపిక్ రావడానికి కారణముంది. వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ ఊహించని షాక్ తిన్నాడు. యష్ రాజ్ ఫిలింస్, అయాన్ ముఖర్జీలను బ్లైండ్ గా నమ్ముకోవడం బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. ఇంతకు ముందు రామ్ చరణ్, ప్రభాస్ సైతం ఇదే తరహాలో జంజీర్, ఆదిపురుష్ లతో షాకులు తినడం చూశాం. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
మహేష్ 29 సినిమాల ప్రస్థానంలో ఒక్క హిందీ దర్శకుడు లేడు. అందరూ దక్షిణాది అందులోనూ టాలీవుడ్ చెందినవాళ్ళే ఎక్కువ. స్పైడర్ తో మురుగదాస్, ఎస్జె సూర్యతో నాని చేసి ఇద్దరు కోలీవుడ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు కానీ ఆ రెండూ డిజాస్టర్లు కావడం వేరే విషయం. మిగిలిన లిస్టు చూస్తే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి దర్శకధీర రాజమౌళి దాకా అందరూ తెలుగువాళ్ళే. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, శోభన్, తేజ, గుణశేఖర్, కృష్ణవంశీ, శ్రీకాంత్ అడ్డాల, పరశురామ్ పేట్ల ఇలా అందరి మూలాలు తెలుగులోనే ఉన్నాయి. తన ప్లానింగ్ అలా ఉంటూ వచ్చింది.
అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తాడు. మహేష్ తరహాలోనే రాఘవేంద్రతో మొదలుపెట్టి సుకుమార్ దాకా తాను ఎప్పుడూ హిందీ ఎంట్రీ గురించి ఆలోచించలేదు. ఆ మధ్య సంజయ్ లీల భన్సాలీ లాంటి ఒకరిద్దరు ప్రయత్నించినా ఆలోచించి ఆగాడు తప్పించి కల్ట్ డైరెక్టరని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పూరి జగన్నాధ్, వివి వినాయక్, క్రిష్, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్, బోయపాటి శీను అంటూ లోకల్ గా అలోచించి గ్లోబల్ గా ఎదిగాడు. ఆ నమ్మకమే పుష్ప రూపంలో ప్యాన్ ఇండియా మార్కెట్ సృష్టించి ఇచ్చింది. ఇప్పుడు చరణ్, తారక్, ప్రభాస్ పొరపాట్లు చూస్తుంటే మహేష్, బన్నీ ఎంత సరైన దారిలో వెళ్తున్నారో అర్థమవుతుంది.
This post was last modified on August 15, 2025 12:37 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…