కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓటర్లను తొలగించే హక్కు తమకు ఉందని.. అదేసమయంలో ఎందుకు తొలగించామో.. చెప్పాల్సిన అవసరం మాత్రం తమకు లేదని.. నిబంధనలు కూడా తమకు అనుకూలంగానే ఉన్నాయని వాదిస్తూ వచ్చిన ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. “ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగించడం అంటే.. ప్రజల హక్కులను తొలగించినట్టే. దీనిని తెలుసుకునే అవకాశం, అవసరం కూడా వారికి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పారదర్శకత చాలా ముఖ్యం.” అని వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో బిహార్లో ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఎన్నికల ఓటర్ల జాబితాలో తొలగించిన 65 లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించారు? ఎక్కడ తొలగించారు? వారు ఎప్పటి నుంచి ఓట్లు వేస్తున్నారు? తొలగించడానికి ముందు వారికి సంబంధించిన వివరాలు మీ వద్ద ఉన్నాయా? వంటి కీలక అంశాలను లేవనెత్తింది. ఆయా వివరాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. “మీరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. మేం ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం. ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆయా వివరాలను మీరు ఆన్లైన్లో పెట్టండి. ప్రజలకు చెప్పండి.” అని కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
బీహార్ ఓటర్ల జాబితాలో 65 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగిస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర యుద్ధమే ప్రకటించింది. బతికి ఉన్న వారిని కూడా జాబితా నుంచి తొలగించారని పేర్కొంది. అంతేకాదు.. జాబితాల్లో చనిపోయారంటూ.. పేర్కొన్న వారిని ఢిల్లీకి పిలిపించిన రాహుల్గాంధీ.. వారితో కలిసి టీ తాగుతూ.. సంబంధిత ఫొటోలను ఆన్లైన్లో పెట్టారు. “ఎన్నికల సంఘం చనిపోయారని పేర్కొన్న వారు.. ఇప్పుడు నాతోనే ఉన్నారు. వారంతా టీ తాగేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.” అని రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ పరిణామం తాజాగా ఈ కేసులను పరిశీలిస్తున్న సుప్రీం కోర్టును కుదిపేసింది. చనిపోయారని చెబుతున్నవారు బతికి ఉన్నారంటే.. ఎన్నికల సంఘంలోనే ఏదో లోపం ఉందని వ్యాఖ్యానించింది. పారదర్శక తకు పెద్దపీట వేయాల్సిన సంఘం.. ఇలా వ్యవహరించడం ఏంటని నిలదీసింది. ఈ నేపథ్యంలో వారి వివరాలను ఎన్నికల వెబ్ సైట్లో జిల్లాల వారీగా అందరికీ తెలిసే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ప్రజల ప్రాథమిక హక్కులు రాజకీయాలపై ఆధారపడడాన్ని తాము సహించేది లేదని స్పష్టం చేసింది.
This post was last modified on August 14, 2025 9:53 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…