Political News

ఆ ’65 ల‌క్ష‌ల ఓట్ల’పై ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిందే: సుప్రీంకోర్టు

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓట‌ర్ల‌ను తొల‌గించే హ‌క్కు త‌మ‌కు ఉంద‌ని.. అదేసమ‌యంలో ఎందుకు తొల‌గించామో.. చెప్పాల్సిన అవ‌స‌రం మాత్రం త‌మ‌కు లేద‌ని.. నిబంధ‌న‌లు కూడా త‌మ‌కు అనుకూలంగానే ఉన్నాయ‌ని వాదిస్తూ వ‌చ్చిన ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చిం ది. “ప్ర‌జాస్వామ్యంలో ఓట్లు తొల‌గించ‌డం అంటే.. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను తొల‌గించిన‌ట్టే. దీనిని తెలుసుకునే అవ‌కాశం, అవ‌స‌రం కూడా వారికి ఉంటుంది. ఈ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం పార‌ద‌ర్శ‌క‌త చాలా ముఖ్యం.” అని వ్యాఖ్యానించింది.

ఈ క్ర‌మంలో బిహార్‌లో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ముసాయిదా ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితాలో తొల‌గించిన 65 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను ఎందుకు తొల‌గించారు? ఎక్క‌డ తొల‌గించారు? వారు ఎప్ప‌టి నుంచి ఓట్లు వేస్తున్నారు? తొల‌గించడానికి ముందు వారికి సంబంధించిన వివ‌రాలు మీ వ‌ద్ద ఉన్నాయా? వంటి కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తింది. ఆయా వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. “మీరు రాజ‌కీయ కోణంలో చూస్తున్నారు. మేం ప్ర‌జ‌ల కోసం ఆలోచ‌న చేస్తున్నాం. ప్ర‌జ‌ల‌కు అన్ని హ‌క్కులు ఉన్నాయి. కాబ‌ట్టి ఆయా వివ‌రాల‌ను మీరు ఆన్‌లైన్‌లో పెట్టండి. ప్ర‌జ‌ల‌కు చెప్పండి.” అని కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.

బీహార్ ఓట‌ర్ల జాబితాలో 65 ల‌క్ష‌ల మందికి పైగా ఓట‌ర్ల‌ను తొలగిస్తూ.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర యుద్ధ‌మే ప్ర‌క‌టించింది. బ‌తికి ఉన్న వారిని కూడా జాబితా నుంచి తొల‌గించార‌ని పేర్కొంది. అంతేకాదు.. జాబితాల్లో చ‌నిపోయారంటూ.. పేర్కొన్న వారిని ఢిల్లీకి పిలిపించిన రాహుల్‌గాంధీ.. వారితో క‌లిసి టీ తాగుతూ.. సంబంధిత ఫొటోల‌ను ఆన్లైన్‌లో పెట్టారు. “ఎన్నిక‌ల సంఘం చ‌నిపోయార‌ని పేర్కొన్న వారు.. ఇప్పుడు నాతోనే ఉన్నారు. వారంతా టీ తాగేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.” అని రాహుల్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ ప‌రిణామం తాజాగా ఈ కేసుల‌ను ప‌రిశీలిస్తున్న సుప్రీం కోర్టును కుదిపేసింది. చ‌నిపోయార‌ని చెబుతున్నవారు బ‌తికి ఉన్నారంటే.. ఎన్నిక‌ల సంఘంలోనే ఏదో లోపం ఉంద‌ని వ్యాఖ్యానించింది. పార‌ద‌ర్శక తకు పెద్ద‌పీట వేయాల్సిన సంఘం.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని నిల‌దీసింది. ఈ నేప‌థ్యంలో వారి వివ‌రాల‌ను ఎన్నిక‌ల వెబ్ సైట్‌లో జిల్లాల వారీగా అంద‌రికీ తెలిసే అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆదేశించింది. ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కులు రాజ‌కీయాల‌పై ఆధార‌ప‌డ‌డాన్ని తాము స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

This post was last modified on August 14, 2025 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago