సైమా అవార్డుల ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టాలీవుడ్ కు ఏడు జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ సత్కరించుకోలేదని, కానీ సైమా ఆ చొరవ తీసుకుని మంచి పని చేసిందని మెచ్చుకుంటూ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదే కాబట్టి ఎవరిని ఏం అనలేం అనే తరహాలో అన్న మాటలు ఒకరిని ఉద్దేశించినవి కాకపోయినా అందులో నిగూడార్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఊరికే వివాదం కోసం యథాలాపంగా ఏదో అనేయడం కాదు. ప్రాక్టికల్ గానే ఉన్నారని విశ్లేషించుకుంటే అర్థమవుతుంది.
నిజంగానే నేషనల్ అవార్డు విజేతలను తెలుగు పరిశ్రమ సెలెబ్రేట్ చేసుకోలేదు. ఇప్పటిదాకా ఎందరో అగ్రహీరోలకు కలగా మిగిలిన ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. మొత్తం ఏడు విభాగాల్లో మన సత్తా బయట పడింది. కానీ సన్మానం చేసే దిశగా ఎవరూ ఆలోచించలేదు. ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరూ చొరవ తీసుకోలేదు. కొందరు ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు తప్పించి అంతకు మించి ఏం లేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో బన్నీకి బెయిల్ వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళలో సగం మంది జాతీయ అవార్డు వచ్చిన టైంలో కలిసి ఉండరు.
థియేటర్ వ్యవహారాలు, ఓటిటి హక్కులు, పైరసీ భూతం ఇలా బోలెడు సమస్యలు వేధిస్తుంటే ఎవరూ ఒక తాటిపైకి రావడం లేదు. తమ కొత్త రిలీజ్ హడావిడి అయిపోగానే మిగిలినవి తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించే వాళ్లే ఎక్కువ. దిల్ రాజు, నాగవంశీ లాంటి అగ్ర నిర్మాతలు ఈ విషయంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు కానీ ఎవరైనా వింటేగా. అందుకే అల్లు అరవింద్ ఇవాళ పబ్లిక్ స్టేజి మీద కుంపటి కామెంట్లు చేయాల్సి వచ్చింది. థియేటర్ల బంద్ ఇష్యూ వచ్చినప్పు కూడా ఇదే తంతు జరిగింది. ఆయన అన్నంత మాత్రాన ఏదో మార్పు వస్తుందని కాదు కానీ అందరూ కనీసం ఆలోచిస్తేనైనా మంచిదే.
This post was last modified on August 15, 2025 7:49 am
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…