బీఆర్ ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ప్రజల కోసం పోరాటం చేస్తున్నవారిని అరెస్టు చేయడం, వారి గొంతు నొక్కడం సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తక్షణమే ప్రవీణ్ కుమార్ను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ఏం జరిగింది?
ఆసిఫాబాద్ జిల్లాలోని పోడు భూముల్లో సాగుచేసుకునే గిరిజన రైతులు.. తమకు హక్కులుకల్పించాలని కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే.. సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పైగా.. పోడు భూములకు చట్టం వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రైతులు మాత్రం వివిధ రూపాల్లో తమ డి మాండ్ల సాధనకు ప్రయత్నిస్తున్నారు. వీరికి సహజంగానే కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఉంది. తాజాగా.. బీఆర్ఎస్ కూడా ఈ రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్. ప్రవీణ్.. రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఆసిఫాబాద్కు బయలు దేరారు.
ఇక, ఈ విషయం తెలిసిన పోలీసులు కాగజ్నగర్ వద్దే ఆర్.ఎస్. ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వేరే పోలీసు స్టేషన్కు తరలించే క్రమంలో వాహనాన్ని బీఆర్ ఎస్ నాయకులు చుట్టుముట్టి ప్రవీణ్ను తక్షణమే వదిలి పెట్టాలని నినాదాలు చేశారు. ఇక, ఈవ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్.. రైతుల హక్కుల కోసం.. పేదల పక్షాన తాము పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేక పోతోందని.. అందుకే తమ నాయకులను అరెస్టు చేస్తోందని వ్యాఖ్యానించారు. తక్షణమే ప్రవీణ్ను విడిచిపెట్టకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేటీఆర్ హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
This post was last modified on August 14, 2025 5:45 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…