Political News

బాల‌య్య ఇలాకాలో జ‌గ‌న్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా…?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం పార్టీ అధినేత జగన్‌కు ఉంది. అయితే టిడిపి కంచుకోటలో పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ మరింతగా దిగజారుతున్న వాతావరణం కనిపిస్తోంది.

తెలుగుదేశం కంచుకోట హిందూపురం నియోజకవర్గం.. ఇక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. వైసిపి ఆవిర్భావం నుంచి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పార్టీ వరుసగా మూడుసార్లు ఓడిపోయిందన్న అభిప్రాయం వైసిపి కార్యకర్తల్లోనే ఉంది. రాష్ట్రం అంతటా పార్టీ బలంగా ఉన్న 2019 ఎన్నికలలో కూడా హిందూపురంలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. హిందూపురం వైసీపీలో మొదటి నుంచి వర్గ పోరు తీవ్రంగా ఉంది.

ముందు కాంగ్రెస్ లో ఉన్న నవీన్ నిశ్చ‌ల్ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో ఆయన బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయానికి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ని తెరమీదకు తీసుకు వచ్చింది. ఆయన వచ్చాక ఇక్కడ గ్రూపులు మరింతగా పెరిగిపోయాయి. ఓవైపు నవీన్ వర్గం.. మరోవైపు ఇక్బాల్ వర్గం.. అదే టైంలో హత్యకు గురైన చౌడూరు రామకృష్ణారెడ్డి వర్గం ఇలా మూడు ముక్కలాట నడిచింది. 2024 ఎన్నికల సమయానికి ఇక్బాల్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. అదే టైంలో ఇన్చార్జిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురుబ దీపికను సీన్లోకి తీసుకువచ్చారు. 2024 ఎన్నిక‌ల్లో మరోసారి వైసిపి ఓడిపోయింది.

ఇక ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి త‌ర్వాత కూడా ఇక్క‌డ గ్రూపుల గోల త‌ప్ప‌డం లేదు. న‌వీన్ 2029 ఎన్నిక‌ల్లో తానే అభ్య‌ర్థిని అంటూ ప్ర‌చారం చేసుకున్నారు. కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా టిక్కెట్ త‌న‌దే అంటున్నార‌ట‌. దీనిపై ఇన్‌చార్జ్ పిల్లి దీపిక‌తో పాటు పార్టీ ప‌రిశీల‌కులు ర‌మేష్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం అటు న‌వీన్ నిశ్చ‌ల్‌తో పాటు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. దీంతో న‌వీన్‌, వేణుగోపాల్ వ‌ర్గం ఎటు వైపు వెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితి. దీపిక పార్టీ కేడ‌ర్‌ను ఏక‌తాటిమీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ఏదేమైనా హిందూపురం విష‌యంలో జ‌గ‌న్ చేస్తోన్న త‌ప్పులు పార్టీని మ‌రింత దిగ‌జారుస్తున్నాయి.

This post was last modified on August 14, 2025 8:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago