నియోజకవర్గాల రాజకీయాలు కూడా ఆసక్తిగా మారుతుంటాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడి వేడిగా ఉన్న నియోజకవర్గాలు కొన్నయితే.. ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు కొన్నిఉన్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే.. ఇక్కడి 53 నియోజకవర్గాల్లో సగానికిపైగా నియోజకవర్గాల్లో రాజకీయాలు దూకుడుగా ఉన్నాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వైఖరి కొన్ని కొన్ని చోట్ల వివాదం కూడా అవుతోంది. అయితే.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. ప్రశాంతమైన పరిస్థితి నెలకొంది.
ఇలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్నారు. ర్యాండమ్గా పరిశీలించారు కూడా. వీటిలో కదిరి నియోజకవర్గంలో వివాదాలు లేకుండా.. పనులు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి నేతల వ్యవహారంపెద్దగా లేకపోవడం.. పనులు చేసుకునే అవకాశం ఉండడంతోపాటు.. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అభివృద్ధికి కీలకంగా మారడం.. కూడా చంద్రబాబుకు సంతోషాన్నించింది.
రెండు కీలక విషయాలను ఎమ్మెల్యే కందికుంట చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు. ఇవి రెండు కూడా చంద్రబాబు పదే పదే చెబుతున్నవే కావడం గమనార్హం. 1) పీ-4: ఈ విషయంలో కందికుంట యాక్టివ్గా ఉన్నారు. సమాజంలోని పేదలను దత్తత తీసుకుని.. వారి అభివృద్ధికి దోహదపడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.దీంతో తనకు పరిచయం ఉన్న ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలతో పీ-4 కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో పక్కాగా అమలు చేసేందుకు కందికుంట ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 500 మంది పేదలను గుర్తించారు.
ఇక, 2) సుపరిపాలనలో తొలి అడుగు: ఈ కార్యక్రమం కూడా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదే. ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన పనులు, చేసిన సంక్షేమం వంటి వాటిని ప్రజలకు వివరించడంతో పాటు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నది చంద్రబాబు నిర్ణయం. ఈ ఆదేశాలను కదిరి ఎమ్మెల్యే తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. రోజుకు కనీసం 50 ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు . ప్రబుత్వం చేస్తున్న పనులు కూడా వివరిస్తున్నారు. దీంతో కదిరి నియోజకవర్గంలో అటు అభివృద్ధితోపాటు.. ఇటు చంద్రబాబు చెప్పిన పనులు కూడా జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on August 13, 2025 9:54 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…