సత్యపాల్ మాలిక్.. జమ్ము కశ్మీర్ కు కొన్నాళ్ల కిందటి వరకు గవర్నర్గా పనిచేశారు. మంగళవారం అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గతంలో లోక్సభ, రాజ్యసభ సభ్యుడి గా కూడా పనిచేసిన సత్యపాల్ మాలిక్.. రెండే మూడు మాసాల కిందటి వరకు జాతీయ మీడియా లో ప్రధా న వార్తగా నిలిచారు. గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇంట్లో రెండు వారాల కిందట సీబీఐ అధికారులు దాడులు చేశారు. లెక్క చూపని నగదు అంటూ.. 30 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నా రు.
ఈ ఒత్తిడితో ఆయన అనారోగ్యం పాలయ్యారనేది కుటుంబ సభ్యులు చెబుతున్న మాట. ఇదిలావుంటే.. అసలు సత్యపాల్ మాలిక్ ఎవరు? ఎందుకు వివాదం అయ్యారు? అసలు హాట్ టాపిక్గా ఎలా మారారు? అనేది ఆసక్తికరం. ఉత్తరప్రదేశ్లో జన్మించిన సత్యపాల్.. న్యాయ విద్య అభ్యసించారు. అనంతరం.. రాజ కీయాల్లోకి వచ్చారు. తర్వాత.. పార్టీలు మారుతూ.. 2012 నాటికి ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా కూడా పనిచేశారు. ఆర్ఎస్ఎస్లో కొంత వరకు పనిచేశారు. ఇది .. 2014 తర్వాత.. కీలక మలుపు తిరిగింది.
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తర్వాత.. మాలిక్ దశ తిరిగింది. ఆయనను జమ్ము కశ్మీ ర్ సహా.. మేఘాలయ, గోవా, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నర్గా నియమించారు. అయితే.. ఆ తర్వాత అనూహ్యంగా ప్రధాని మోడీతో మాలిక్ విభేదించారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల అధిపతులు.. ముఖేష్ అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. అదేసమయంలో మోడీ మంత్రి వర్గంలో అవినీతిపరులు ఉన్నారని.. మోడీ వారిని వెనుకేసుకువస్తున్నారని కూడా మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరీ ముఖ్యంగా.. ప్రధాని మోడీ వైఫల్యం కారణంగానే పుల్వామా(జమ్ము కశ్మీర్లోని)లో ఉగ్రవాద దాడి జరిగిందని సంచలన విమర్శలు చేశారు. దీంతో కేంద్రానికి- సత్యపాల్ మాలిక్కు మధ్య అంతరం పెరిగి పోయింది. అనంతర పరిణామాల్లో మాలిక్పై అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ.. సీబీఐ అధికారులు ఆయన నివాసంపైదాడి చేశారు. ఇది కూడా వివాదానికి దారితీసింది. ఈ కేసు కొనసాగుతున్న క్రమంలోనే మాలిక్ కన్నుమూశారు.
This post was last modified on August 5, 2025 3:30 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…