తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో నానాటికీ ముసురు ముదురుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సొంత పార్టీపై… ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ నేత అంటూ వ్యాఖ్యానించిన కవిత, ఆ లిల్లీపుట్ నేత కారణంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంత హీన స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ మీడియా సమావేశంలో “కవిత ఎవరు?” అంటూ జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత ఆదివారం జగదీశ్ రెడ్డిని ఏకంగా లిల్లీపుట్ అంటూ హేళన చేశారు. అంతేకాకుండా, కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎక్కడ ఉండేవారు అని కూడా ఆమె ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో తన సీటును మాత్రం గెలుచుకున్న ఆ లిల్లీపుట్ నేత, జిల్లాలోని మిగిలిన అన్ని సీట్లలో పార్టీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు.
ఇక ఇంటి ఆడపడచుపైనే లిల్లీపుట్ లాంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే బీఆర్ఎస్ సోదరుల నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం ఆ లిల్లీపుట్ నేత వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఉన్నారని కూడా ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఆ బడా నేత ఏది చెబితే, లిల్లీపుట్ నేత అదే మాట్లాడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఆడపడచులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… జగదీశ్ రెడ్డిపై ఇటీవల పలువురు నేతలు కవిత తరహా వ్యాఖ్యలే చేస్తుండటం గమనార్హం. మొన్నామధ్య స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి… నల్లగొండ జిల్లాకు చెందిన “ఆ మూడు అడుగుల రెడ్డి” అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఆ తర్వాత పలువురు తెలంగాణ మంత్రులు కూడా జగదీశ్ రెడ్డిపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత, జగదీశ్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయనను ఏకంగా లిల్లీపుట్ అంటూ సంబోధించడం గమనార్హం.
This post was last modified on August 5, 2025 8:06 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…