Political News

ఆయనో లిల్లీపుట్.. ఆయన వెనక పెద్ద నేత: కవిత

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో నానాటికీ ముసురు ముదురుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సొంత పార్టీపై… ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ నేత అంటూ వ్యాఖ్యానించిన కవిత, ఆ లిల్లీపుట్ నేత కారణంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంత హీన స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మీడియా సమావేశంలో “కవిత ఎవరు?” అంటూ జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత ఆదివారం జగదీశ్ రెడ్డిని ఏకంగా లిల్లీపుట్ అంటూ హేళన చేశారు. అంతేకాకుండా, కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎక్కడ ఉండేవారు అని కూడా ఆమె ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో తన సీటును మాత్రం గెలుచుకున్న ఆ లిల్లీపుట్ నేత, జిల్లాలోని మిగిలిన అన్ని సీట్లలో పార్టీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు.

ఇక ఇంటి ఆడపడచుపైనే లిల్లీపుట్ లాంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే బీఆర్ఎస్ సోదరుల నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం ఆ లిల్లీపుట్ నేత వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఉన్నారని కూడా ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఆ బడా నేత ఏది చెబితే, లిల్లీపుట్ నేత అదే మాట్లాడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఆడపడచులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు.

ఇదిలా ఉంటే… జగదీశ్ రెడ్డిపై ఇటీవల పలువురు నేతలు కవిత తరహా వ్యాఖ్యలే చేస్తుండటం గమనార్హం. మొన్నామధ్య స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి… నల్లగొండ జిల్లాకు చెందిన “ఆ మూడు అడుగుల రెడ్డి” అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఆ తర్వాత పలువురు తెలంగాణ మంత్రులు కూడా జగదీశ్ రెడ్డిపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత, జగదీశ్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయనను ఏకంగా లిల్లీపుట్ అంటూ సంబోధించడం గమనార్హం.

This post was last modified on August 5, 2025 8:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

17 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

20 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago