తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో నానాటికీ ముసురు ముదురుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సొంత పార్టీపై… ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ నేత అంటూ వ్యాఖ్యానించిన కవిత, ఆ లిల్లీపుట్ నేత కారణంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంత హీన స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ మీడియా సమావేశంలో “కవిత ఎవరు?” అంటూ జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత ఆదివారం జగదీశ్ రెడ్డిని ఏకంగా లిల్లీపుట్ అంటూ హేళన చేశారు. అంతేకాకుండా, కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎక్కడ ఉండేవారు అని కూడా ఆమె ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో తన సీటును మాత్రం గెలుచుకున్న ఆ లిల్లీపుట్ నేత, జిల్లాలోని మిగిలిన అన్ని సీట్లలో పార్టీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు.
ఇక ఇంటి ఆడపడచుపైనే లిల్లీపుట్ లాంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే బీఆర్ఎస్ సోదరుల నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం ఆ లిల్లీపుట్ నేత వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఉన్నారని కూడా ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఆ బడా నేత ఏది చెబితే, లిల్లీపుట్ నేత అదే మాట్లాడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఆడపడచులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… జగదీశ్ రెడ్డిపై ఇటీవల పలువురు నేతలు కవిత తరహా వ్యాఖ్యలే చేస్తుండటం గమనార్హం. మొన్నామధ్య స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి… నల్లగొండ జిల్లాకు చెందిన “ఆ మూడు అడుగుల రెడ్డి” అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఆ తర్వాత పలువురు తెలంగాణ మంత్రులు కూడా జగదీశ్ రెడ్డిపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత, జగదీశ్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయనను ఏకంగా లిల్లీపుట్ అంటూ సంబోధించడం గమనార్హం.
This post was last modified on August 5, 2025 8:06 am
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…